India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు అనేక చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక బృందం అధికారులు విస్తృతంగా పరిశీలించి, జూబ్లీహిల్స్, నల్లగండ్ల సహా 34 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఫోర్స్లను ఏర్పాటు చేసి, తగిన చర్యలు చేపడుతున్నట్లు యంత్రాంగం తెలిపింది. రాబోయే రోజుల్లోనూ శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొంది.
HYD మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో యువకులను టార్గెట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టాక్ మార్కెట్ అంచనాలు వేస్తామని రూ.కోట్ల మోసాలు చేశారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పెట్టుబడుల్లో నెలకు 7 శాతం, వార్షికంగా 84% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయని నమ్మించారు. మొదట నమ్మించి, కొన్ని నెలలు గడిచాక, కనిపించకుండా పోయారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
EPFO సేవలు అరచేతిలో అందిస్తున్నట్లుగా HYD EPFO అధికారులు తెలియజేశారు. మొబైల్ ఫోన్లో ఉమాంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నమెంట్ యాప్, UIDAI యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ నంబర్ను అనుసంధానం చేసి, మొబైల్ నంబర్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. HYD నగర వ్యాప్తంగా ఉన్న EPFO లబ్ధిదారులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీ ఫార్మసీకి సంబంధించి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈరోజు HYD జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్కి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. 5,573 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5,433 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 4,215 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. 77.52 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైందని వారు తెలిపారు.
HYDలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలింగ్ సరిగ్గా జరగడం లేదు. దీంతో బ్యాటరీల నుంచి వెలువడే సీసం, పాదరసం, క్రోమియం, బ్రోమియం లాంటి అనేక విషపూరిత పదార్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది. వ్యర్థాల రీసైక్లింగ్ సరిగ్గా జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు PCB అధికారులు పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ ఆ స్థాయిలో చర్యలు లేకపోవడం గమనార్హం.
గ్రేటర్ HYD వ్యాప్తంగా మెట్రో జోన్ పరిధిలో దాదాపు 550 కిలోమీటర్ల మేరకు లైన్లలో మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న తీగల స్థాయిలో ఎయిర్ బెంచ్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్ పరిధిలో పోల్ టూ పోల్ తనిఖీల్లో ఓవర్ హెడ్ కండక్టర్లను మార్చాల్సిందిగా గుర్తించారు.
HYDలో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో స్లీపింగ్ ప్యాడ్స్కు డిమాండ్ ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి కోసం వీటిని ఆశ్రయిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, కాచిగూడ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జోరుగా సాగుతోంది. ఇప్పటికే శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఐటీ రిటర్న్ పేరిట నకిలీ లింక్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు HYD సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. అలాంటివి ఏవైనా మీరు గుర్తించినట్లయితే వెంటనే 18001030025, 18004190025 నంబర్లకు కాల్ చేసి, హెల్ప్ లైన్ ద్వారా సమాచారం పొందే అవకాశం ఉందని తెలిపారు. ITR అక్షరాన్ని వారు పంపి, లింక్లో జోడించి, హెల్ప్ డెస్క్ అంటూ వెబ్సైట్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
దసరా పండుగకు సొంతూళ్లకు ప్రయాణించేందుకు ప్రజలు ఇప్పటి నుంచే రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ వంటి ప్రధాన మార్గాల్లోని అనేక రైళ్లలో బెర్త్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయి, వెయిటింగ్ లిస్టులు కూడా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని అధికారులు గమనిస్తున్నారు.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ రోడ్డెక్కినా ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. HYDకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. దీంతో మేమున్నామంటూ మెట్రో పేర్కొంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. ప్రయాణికుల మీద చినుకుపడకుండా గమ్య స్థానాలకు చేర్చుతామని తెలిపింది. చింతలేకుండా ప్రయాణించాలని భరోసానిస్తోంది. ఫ్లడ్స్ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని, సర్వీసులు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.