India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గచ్చిబౌలిలో కాల్పుల్లో గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వెంకట్ రెడ్డి మాదాపూర్ సీసీఎస్లో పని చేస్తున్నాడని, ఆయన స్వగ్రామం శంకర్పల్లి సింగపూర్ మండలం. ప్రస్తుతం ఆయన కాలికి గాయమైందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపినట్లు సీపీ వెల్లడించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మరో 3 రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు ఉండటంతో హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీ పీఠం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు కుస్తీలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పిలిపించుకొని ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళ్లి ఢిల్లీలో సీఎం ప్రచారం చేయనున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై తేల్చేందుకు వేగం పెంచిన సర్కారు.. అందులో భాగంగానే పలు చర్యలు చేపడుతుంది. నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి వాటిని ఆమోదించేందుకు ప్లాన్ చేస్తుంది. నివేదికలు ప్రభుత్వానికి అందడం, అనంతరం కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి కేబినెట్కు అందించడం, మంత్రివర్గంలో వాటికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 35 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కరిబిక్కిర అవుతున్నారు. HYDలో గరిష్ఠంగా 34.4 డిగ్రీలు, కనిష్ఠంగా 17.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే ఉదయం హైవేలను పొగమంచు కప్పేస్తూ.. రాత్రి పూట పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు నమోదవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకులాలలో ప్రవేశాల కోసం, దరఖాస్తు స్వీకరణ గడువును ఫిబ్రవరి 6 వరకు పెంచుతున్నట్టు గురుకులాల సెక్రటరీ వీఎస్ అలుగు వర్షిణి శనివారం తెలిపారు. గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాల గడువు ఫిబ్రవరి 1 అయినప్పటికీ పలు కారణాలతో ఫిబ్రవరి 6 వరకు గడువును పొడిగిస్తున్నామని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1912 నంబర్ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో ZERO బడ్జెట్ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. 8 మంది BJP ఎంపీలు, 8 మంది INC ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని BRS నేతలు విమర్శలకు దిగారు. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణ భాగస్వామి’ అంటూ కిషన్ రెడ్డి, ‘దేశ గతిని మార్చే బడ్జెట్ ఇది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు సైతం ఫైర్ అయ్యారు. మరి సెంట్రల్ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.