India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ప్రభావం చూపుతోంది. నగరశివారు మూడుచింతలపల్లిలో చికెన్, మటన్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోయాయి. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ, ఈ ఆదివారం తెలుగు నూతన సంవత్సరం కావడంతో ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేస్తున్నారు. దీంతో నాన్ వెజ్కు దూరంగా ఉంటున్నారు. గిరాకీ లేదని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
అత్తాపూర్లో శనివారం హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ వాసి <<15926041>>పింకీ(37)<<>> అమిష్లోయాను ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 22న మరోసారి పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, తాను జమ చేసిన డబ్బు భర్త షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు. ఈ మనస్తాపంతో ఆమె ఉరేసుకుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 12 మంది సెక్స్వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. AHTU DCP ఆధ్వర్యంలో కూకట్పల్లి, KPHB, గచ్చిబౌలి PS పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళలను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.
హీరో ప్రభాస్ PRO అంటూ తనకు కాల్ చేసి బెదిరించారని జూబ్లీహిల్స్ PSలో యూట్యూబర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు.. మార్చి 4న విజయ్సాధు ప్రభాస్కు సర్జరీ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఆ హీరో PROను అంటూ సురేశ్ అతడికి కాల్ చేసి వెంటనే డిలీట్ చేయాలని దూషించాడు. విజయ్సాధు వీడియో డిలీట్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులకు సురేశ్ లింక్ పంపాడు. FANS సైతం వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ పోలీసులను ఆశ్రయించారు.
ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ ఉద్యోగి స్వరూప రాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్కి చెందిన స్వరూపా రాణి(58) శంషాబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడ్మిన్గా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శంషాబాద్కు వెళ్లిన స్వరూపా రాణి విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అంబర్ పేట పీఎస్లో న్యూస్లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
అంబర్ పేట పీఎస్లో న్యూస్లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్ మండలంలో అత్యధికంగా 40.0℃, షేక్పేట 39.9, నాంపల్లి 39.9, అంబర్పేట్ 39.9, మరేడ్పల్లి 39.9, హిమాయత్నగర్ 39.9, ఖైరతాబాద్ 39.9, అసిఫ్నగర్ 39.9, చార్మినార్ 39.9, బండ్లగూడ 39.9, సైదాబాద్ 39.8, బహదూర్పురా 39.5, గోల్కొండ 39.4, సికింద్రాబాద్ మండలంలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.
ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.
Sorry, no posts matched your criteria.