Hyderabad

News February 24, 2026

Trending: HYDలో అంతాక్షరీ 2.O!

image

చిన్నప్పుడు మనం ఫ్రీగా ఆడిన అంతాక్షరీ ఇప్పుడు ‘మ్యూజికల్ జామింగ్’ (Musical Jamming) పేరుతో కొత్త రూపం దాల్చింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ కేఫ్స్‌లో వారాంతాల్లో ఈ సెషన్స్ జరుగుతున్నాయి. దీనికోసం జెన్-జీ కుర్రాళ్లు ఒక్కొక్కరు రూ.499 నుంచి రూ.999 వరకు టికెట్ కొని మరీ వెళ్తున్నారు. పాత పాటలకే కొత్త ట్యూన్లు కట్టి, చప్పట్లు కొడుతూ పాడటమే ఈ ‘పెయిడ్ అంతాక్షరి’ స్పెషాలిటీ. పాత ఆటకి కార్పొరేట్ రేట్ పడింది.

News February 24, 2026

HYD: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే!

image

రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే. 2012 నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉండటంతో గతంలో అనుమతులున్నా మార్కెట్ రేటు చెల్లించి స్వాధీనం చేసుకుంటామని RDO వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. కిస్మత్‌పురా, దర్గా, ఉప్పర్‌పల్లిలో ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు. ఇక 500 మీటర్ల పరిధిలో ఇటుక పెట్టే ఛాన్సే లేదు.

News February 24, 2026

HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

image

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.

News February 24, 2026

మహిళా శక్తికి 20 ఏళ్లు.. భాగ్యనగరంలో YFLO జోష్!

image

‘ఆడవాళ్లు తలచుకుంటే ఆకాశమే హద్దు’ఇది మాటలు కాదు, 20ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం. యువ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(YFLO) తన 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్‌లో అట్టహాసంగా నిర్వహించింది. ఛైర్‌పర్సన్ పల్లవి జైన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో స్వాతిలక్రా, మహిమాదాట్ల, స్వప్నాదత్ పాల్గొన్నారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యతని చెబుతూ.. గత ఛైర్‌పర్సన్లను సన్మానించి మహిళా సాధికారతే లక్ష్యమని చెబుతున్నారు.

News February 24, 2026

నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఘరానా మోసం: బాధితుడు

image

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్‌ ముందు బైఠాయించారు.

News February 24, 2026

HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

image

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్‌ఎటాక్‌తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

News February 24, 2026

HYDలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 4 ఇసుక బజార్లు ప్రారంభించబడ్డాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మే నాటికి 6 కొత్త ఇసుక బజార్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సహాయపడతాయి.

News February 24, 2026

HYD: గాంధీ విగ్రహం వద్దని గాంధీ మునిమనవడి ట్వీట్

image

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం అత్యంత అగాంధేయ చర్య అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. ఇళ్లను కూల్చి స్థలం కల్పించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు ఉండి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయొద్దు’ అని చెప్పేవారని తుషార్ గాంధీ Xలో ట్వీట్ చేశారు.

News February 24, 2026

HYD: 3 కార్పొరేషన్ల వెబ్‌సైట్లు ఇవే!

image

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT

News February 24, 2026

థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

image

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.