India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 15 ZPTC, MPP స్థానాల కోసం SC, ST, BC, మహిళ, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్య నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలను అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు కలెక్టర్ నివేదించనున్నారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పరిధిలోని కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆ సంస్థ వైస్ ఛైర్పర్సన్ శాంతి కుమారి సందర్శించారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఇస్తున్న శిక్షణల వివరాలను కలెక్టర్ పమేలా సత్పతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి కేంద్రంలో ఇచ్చిన శిక్షణ వివరాలు ఆమె తెలిపారు. సైన్ లాంగ్వేజ్ శిక్షణ గురించి శాంతి కుమారి అడిగి తెలుసుకున్నారు.
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళా బ్లూ కోల్ట్స్ పోలీసు సేవలను సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రారంభించినారు. మహిళా పోలీసులకు ప్రభుత్వం తరఫున స్కూటీలు అందజేసి జెండా ఊపి విధుల్లోకి ఆహ్వానించారు. వీరు బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, 100 కాల్స్ అటెండ్ లాంటి విధులు నిర్వహిస్తారు. త్వరలోనే ఈ సేవలు కమీషనరేట్ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని సీపీ అన్నారు.
HYD గాంధీ భవన్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాళ్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క, మహిళా సాధికారత, బలోపేతంపై పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KNR బీసీ స్టడీ సర్కిల్లో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రజా యోధురాలని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తమిళనాడులో జరిగిన సైబర్ మోసంపై కరీంనగర్లో విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో హాజరుపరచగా కోర్టు అందుకు నిరాకరించింది. ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని సూచించింది. కాగా, ఈ కేసులో కిసాన్ నగర్కు చెందిన బండి కుమార్, ఎండీ అన్వర్, దూలం నరేష్ను తమిళనాడు పోలీసులు విచారించారు. వీరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్న వారిపై నగరపాలక సంస్థ కఠిన చర్యలకు సిద్ధమైంది. మొదటగా 40 ప్రాంతాలను గుర్తించి, 15 చోట్ల CC కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వాటిని అనుసంధానం చేస్తున్నారు. చెత్త వేస్తూ పట్టుబడినవారి బండి నంబర్లపై జరిమానా విధించి చలాన్లను ఇంటికే పంపనున్నారు. రూ.1,000 వరకు జరిమానా విధిస్తామని ఇప్పటికే హెచ్చరిక ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటయ్యాయి.
KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని KNR సీపీ గౌష్ ఆలం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన KNR పోలీస్ కమీషనరేట్కు ప్రత్యేకంగా రూపొందించిన నూతన లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. ఇకపై ఈ లోగోను రాష్ట్ర పోలీసు లోగోతో పాటు పోలీసుల యూనిఫామ్పై ధరించవచ్చని కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తర్వాత సొంత లోగోను కలిగి ఉన్న నాల్గో కమీషనరేట్గా KNR నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
HZB, JMKT మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయడం రాజకీయ రగడకు దారితీసింది. ఈ నిధులు తమ కృషి వల్లే వచ్చాయని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా పాలాభిషేకాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పోరాటం వల్ల నిధులు మంజూరయ్యాయని ప్రకటించగా, కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ కృషిని కొనియాడారు. అయితే, నిధులు మంజూరు కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్ రావు తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు 17 దుకాణాలు గీత కార్మికులకు, 9 మద్యం దుకాణాలు ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. 94 దుకాణాల్లో ఏయే దుకాణాలు గీత కార్మికులకు, ఎస్సీలకు రిజర్వ్ చేయాలో డ్రా పద్ధతి ద్వారా ఎంపికచేశారు.
Sorry, no posts matched your criteria.