India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చాకుంత గ్రామానికి చెందిన హస్తపురం రవి, బొమ్మకల్ ఫ్లైఓవర్పై నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ కృష్ణకుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నౌసు యాదగిరిని ఆ పదవి నుంచి తొలగించామని BTF
స్టీరింగ్ కమిటీ సభ్యులు వ్యవస్థాపక నేతలు కొమ్ము రమేష్, దేవ శంకర్, సుధీర్, B.రమేష్ లు ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు కవితను సస్పెండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కమిటీని పూర్తిగా రద్దుచేశారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
KNR-1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ RK బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఆగస్టు 21న ఉ.6 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఆగష్టు 23న KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు 3,000/-, పిల్లలకు 2,250/- నిర్ణయించామన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.
హుజురాబాద్ పట్టణంలోని కిందివాడకు చెందిన పోలీస్ హోంగార్డు బొడిగ తిరుపతి కుమారుడు బొడిగ సందీప్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తి గత అవసరాల నిమిత్తం పట్టణంలోని బతుకమ్మ సౌల్లల్లకు బైక్ పై వెళ్లిన సందీప్ అదుపుతప్పి కిందపడి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఉదయమే తన స్నేహితులు, పరిచయస్తులను కలిసిన సందీప్ ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు స్నేహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొడుతూ చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో యాద సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా KNR పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నరేష్ను కలెక్టర్ ప్రమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.
కరీంనగర్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంక్ అధ్యక్షుడు గడ్డం విలాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను స్మరించుకున్నారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి పట్ల నిబద్ధత పెరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి శ్రీనివాస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈనెల 22న ప్రాంతీయ క్రీడా పాఠశాల యోగా హాల్లో జిల్లాస్థాయి సీనియర్స్ యోగాసన ఎంపిక పోటీలు నిర్వహించన్నుట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. 18ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. 22న ఉ.9 గం.కు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో కోచ్లు వి.కిష్టయ్య, పి.రామకృష్ణ వద్ద నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 8985275068ను సంప్రదించవచ్చు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ముఖ్యఅతిథిగా హాజరవగా, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొయినుద్దిన్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.