India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోయర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే నీరును ఆదివారం నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల మార్చి 31 వరకు ఉండగా అదనంగా ఆరు రోజులు ఎక్కువ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం LMDలో 5.81టీఎంసీ నీరు మాత్రమే ఉందని, కరీంనగర్ నగరానికి కావలసిన తాగునీటికి ఇబ్బంది కాకుండా దిగువకు నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు.
నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.
ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదవబోతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం గణేశ్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర ముఖ్యమైందని, మానవతా దృక్పథంతో వారు సేవలందించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కేశవపట్నం పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి పేర్కొన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఎలుకపెళ్లి కళ్యాణ్కు ఓ కేసు విషయమై కోర్ట్ సమన్లు ఇవ్వడానికి హోంగార్డ్ సదానందం అతని ఇంటికివెళ్ళగా.. తీసుకోవడానికి నిరాకరించాడు. అనంతరం సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించడంతో కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.
కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్ను మంత్రి కోరారు.
Sorry, no posts matched your criteria.