Karimnagar

News August 14, 2025

KNR: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

News August 13, 2025

KNR: ‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’

image

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 5వ వార్షికోత్సవం సందర్భంగా SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఇక్కడ ఎన్సీసీ కేడేట్స్, విద్యార్థులతో కలిసి మాధక ద్రవ్యాలు నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం నషాముక్తభారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

News August 13, 2025

KNR: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

కొత్తపల్లి మండలం ఎలగందుల పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నూరు శాతం మందికి ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించాలని ఆదేశించారు.

News August 13, 2025

కరీంనగర్‌లో రేపు JOB MELA

image

జిల్లాలోని నిరుద్యోగులకు FLIPKARTలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. SSC, ఆపై విద్యార్హత కలిగినవారు, 18-45 ఏళ్లవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9000266335, 7799661512, 9908230384, 7207659969లకు కాల్ చేయొచ్చు. నెల జీతం రూ.20,000- రూ.25,000 వరకు ఉంటుంది.

News August 13, 2025

KNR: భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 0878 2997247 కు కాల్ చేయాలని, ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

News August 13, 2025

కరీంనగర్: ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ రేటింగ్‌లో పాల్గొనాలి

image

కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బోధన, ఇంగ్లీష్ క్లబ్ వంటి అంశాలపై ఆమె మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 12, 2025

KNR: ‘నూతన భవనం వినియోగంలోకి తేవాలి’

image

కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(సైన్స్ వింగ్)ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మతు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. కళాశాలలోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ వెంకటరమణచారి ఉన్నారు.

News August 12, 2025

కరీంనగర్: శ్రావణి సమాఖ్య పురస్కారాలు అందజేత

image

కరీంనగర్‌లో జరిగిన శ్రావణి సాహితీ, సాంస్కృతిక సమాఖ్య త్రిదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవి, అవధాని గండ్ర లక్ష్మణరావు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు వంగపల్లి ప్రభాకర్ రావులకు ఈ పురస్కారాలు లభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరు చేస్తున్న సాహిత్య సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

News August 12, 2025

కరీంనగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు

image

జిల్లాలో గత 12 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూరు మండలం పోచంపల్లిలో 16.3 మి.మీలు, గంగిపెల్లి 15.3, గట్టుదుద్దెనపెల్లి 7.8, జమ్మికుంట 14, కొత్తపల్లి 12.5, తనుగుల 15.8, ఇల్లంతకుంట మండలం మల్యాలో 8.3 మి.మీలు, కేశవపట్నం 13.3, తాడికల్‌లో 7.5 మి.మీల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల్లో వరంగల్ జిల్లా సంగెంలో 202.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది.

News August 12, 2025

శంకరపట్నం: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

శంకరపట్నం మండలం రాజాపూర్‌కు చెందిన పిన్‌రెడ్డి శ్రీకాంత్(29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిపాలైన యువకుడు నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడాడు. రాజాపూర్ మాజీ సర్పంచ్ పిన్‌రెడ్డి వసంత- నరసింహారెడ్డి దంపతుల కుమారుడైన శ్రీకాంత్ చికిత్సకు రూ.లక్షలు దారాబోసినా ప్రాణాలతో బయటపడలేదు. ఈ ఘటనతో మృతుడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.