India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్లో WD&CW ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(POSH Act)పై సోమవారం వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)ల ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ కమిటీలకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాలమరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సూర్యతో పాటు సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సతీష్ స్వగ్రామం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామం.
“ప్రజావాణి”లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 82% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు 37 మందికి గాను 32 మంది (91%), ఇంటర్ పరీక్షకు 73 మందికి గాను 58 మంది (79%) హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు నలుగురు హాజరయ్యారని వివరించారు.
బతుకమ్మ, దసరా పండుగలకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు. బంగారం, డబ్బు లాంటి విలువైనవి తమవెంట తీసుకువెళ్లాలని కోరారు. ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు, నమ్మకస్థులైన ఇరుగుపొరుగు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ 8712670744 నంబర్కు కాల్ చేసి సాయం పొందవచ్చన్నారు.
జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా జమ్మికుంటకు చెందిన ఇటిక్యాల స్వరూపను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డా.మొగుళ్ల భద్రయ్య నియామక పత్రం అందించారని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ తెలిపారు. పేదప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరూప కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకాలకు అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు KNR జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందిరమ్మ మైనారిటి మహిళ యోజన, రేవంతన్నకా సహారా పథకాలకై అభ్యర్థులు tgobmms.cgg.gov.in పోర్టల్ను సందర్శించి, తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆన్లైన్లో వచ్చే అపరిచిత లింకులు, మెసేజ్లు, ఏపీకే ఫైళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, ఇతరుల నుంచి మీ ఖాతాలోకి డబ్బులు స్వీకరించవద్దని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో ఆర్థిక నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షర చిట్ఫండ్, క్రిప్టో కరెన్సీ కేసులతో సహా అన్ని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు వారి సొమ్ము తిరిగి ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ (రేపటి) నుంచి OCT 1వ తేదీ వరకు JBS నుండి KNRకు 1321 బస్సులు, OCT 2వ తేదీ నుంచి 13 తేదీ వరకు KNR నుంచి JBSకు 1330 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ కోసం వెబ్సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.