Karimnagar

News September 17, 2024

కరీంనగర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి

image

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News September 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,53,203 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,346, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,200, అన్నదానం రూ.24,657,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News September 16, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో పట్టాలెక్కిన ‘వందేభారత్’

image

నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్‌ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్‌కార్‌లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.1,510గా ధర నిర్ణయించారు.

News September 16, 2024

కరీంనగర్: రూ.5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం

image

70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

News September 16, 2024

KNR: ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

image

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్‌ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

News September 16, 2024

తిమ్మాపూర్: వలకు చిక్కిన 28 కిలోల చేప

image

తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూడా తిరుపతికి కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగులో (ఎల్ఎండి మానేరు డ్యామ్)లో 28 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. చేపల వేటలో భాగంగా సోమవారం మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో తిరుపతి అనే మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. గణపతి నిమజ్జనం రోజున ఈ వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభసూచకమని అతను ఆనందం వ్యక్తం చేశాడు.

News September 16, 2024

కువైట్‌లో జగిత్యాల వాసి మృతి

image

జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

News September 16, 2024

KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు

image

నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News September 16, 2024

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మహమ్మద్ ప్రవక్త మిలాద్-ఉన్-నబీ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిదక్ (సత్యనిష్ట) తహారత్ (పవిత్రత) జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

News September 16, 2024

HZB: వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

image

సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా హుజూరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. ☞విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి. ☞నీటిలో క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను వేయాలి. ☞ఈత రాని వారు నీటి వద్దకు వెళ్లకూడదు. ☞హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ☞వాహనాలలో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.