Karimnagar

News March 27, 2025

ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్‌కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.

News March 27, 2025

KNR: వారధి సొసైటీ ద్వారా 2,997 మందికి ప్రత్యక్ష ఉపాధి: కలెక్టర్

image

వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015 లో ప్రారంభమైందని అన్నారు. 2 వేల 997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

News March 27, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 40.0°C నమోదు కాగా, జమ్మికుంట 39.7, తిమ్మాపూర్ 39.6, మానకొండూర్, కరీంనగర్ 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక, రామడుగు 38.8, సైదాపూర్ 38.7, శంకరపట్నం, గన్నేరువరం 38.4, హుజూరాబాద్ 38.2, కొత్తపల్లి 38.1, కరీంనగర్ రూరల్ 37.9, ఇల్లందకుంట 37.7, చొప్పదండి 37.6°C గా నమోదైంది.

News March 27, 2025

సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

image

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 27, 2025

సైదాపూర్: తాడిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

తాడిచెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల కనుకయ్య (53) అనే గీతకార్మికుడు తాటికల్లు తీయడానికి రోజూలాగే చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడిక్కడకే మృతి చెందాడు. కనకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 26, 2025

KNR: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలి : కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలన్నారు.

News March 26, 2025

KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.

News March 26, 2025

సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

image

సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 26, 2025

KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

image

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.

News March 26, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు..

image

KNR జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 39.6°C నమోదు కాగా, గంగాధర 39.5, మానకొండూర్ 39.4, జమ్మికుంట 39.3, ఇల్లందకుంట 39.0, కరీంనగర్ 38.9, రామడుగు, చిగురుమామిడి 38.7, శంకరపట్నం 38.4, గన్నేరువరం 38.0, వీణవంక 37.7, కొత్తపల్లి 37.6, కరీంనగర్ రూరల్ 37.3, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.8, సైదాపూర్ 35.5°C గా నమోదైంది.

error: Content is protected !!