Karimnagar

News September 14, 2024

సిరిసిల్ల: విష జ్వరంతో బాలిక మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబీకుల ప్రకారం.. మైదం శెట్టి మల్లికార్జున్ పెద్ద కూతురు నక్షత్ర హాసిని(13)కి బుధవారం జ్వరం వచ్చింది. స్థానిక ఓ ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించగా నయం కాలేదు. ఆ తర్వాత సిరిసిల్ల, KNR నుంచి HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది.

News September 14, 2024

KNR: స్కాలర్‌షిప్స్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని SCDD కరీంనగర్ జిల్లా ఉపసంచాలకులు నాగలేశ్వర్ కోరారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ సహకరించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు అర్హులన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గడువు తేదీ 31.12.2024.

News September 14, 2024

రామగుండంలో వందేభారత్ హాల్ట్

image

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.

News September 14, 2024

KNR: నిమజ్జనం రోజున వైన్స్ విక్రయాలు బంద్

image

ఈనెల 16న గణేష్ నిమజ్జనం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలు, బార్లు క్లోజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా షాపులు తెరుచుకుంటాయి.

News September 13, 2024

కరీంనగర్: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్నివిధాలుగా సహకరించాలని కోరారు.

News September 13, 2024

నంది మేడారం: డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్

image

పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News September 13, 2024

CM రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం MLA

image

రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News September 13, 2024

కరీంనగర్: రుణమాఫీపై స్పష్టత ఏది!

image

రుణమాఫీ కాలేదని ఇటీవల జగిత్యాల జిల్లా భూషణరావుపేట చెందిన రైతు ఏనుగు సాగర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ కాక రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టాలా..? వద్దా…? కడితే.. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు.

News September 13, 2024

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు బంద్

image

పెద్దపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యుడిపై రోగి బంధువుల దాడి ఘటనను నిరసిస్తూ సాధారణ, అత్యవసర వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రతినిధులు ప్రకటించారు. వైద్యులపై దాడులు ఆపకుంటే పెద్దఎత్తున ఆందోళనలు తప్పవన్నారు. ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది.

News September 13, 2024

కరీంనగర్: కూరగాయలకు భారీగా పెరిగిన ధరలు

image

మొన్నటి వరకు శ్రావణమాసం, ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూరగాయల రేట్లు భారీగానే పెరిగాయి. బెండకాయ కిలో రూ.60-70, సొరకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.80, కొత్తిమీర ఏకంగా కిలో రూ.200 వరకు పలుకుతోంది. ఏ కూరగాయల ధరలు చూసినా మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్థులు చెబుతున్నారు.