Karimnagar

News March 28, 2025

రామడుగు: శుక్రవారం సభ పరిష్కారాల వేదిక: కలెక్టర్

image

శుక్రవారం సభ ఒక పరిష్కారం లాంటిదని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలంలోని కొక్కేరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

News March 28, 2025

KNR: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

image

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో కరీంనగర్ జిల్లా 2,77,323 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.

News March 28, 2025

ఎలిగేడు: బాలుడి హత్య

image

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

News March 28, 2025

కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

image

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.

News March 27, 2025

డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి

image

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు

News March 27, 2025

కరీంనగర్: అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలపై సమావేశం

image

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ప్రజాసంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో జిల్లాధికారులతో కరీంనగర్ కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి, 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News March 27, 2025

ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్‌కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.

News March 27, 2025

KNR: వారధి సొసైటీ ద్వారా 2,997 మందికి ప్రత్యక్ష ఉపాధి: కలెక్టర్

image

వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015 లో ప్రారంభమైందని అన్నారు. 2 వేల 997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

News March 27, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 40.0°C నమోదు కాగా, జమ్మికుంట 39.7, తిమ్మాపూర్ 39.6, మానకొండూర్, కరీంనగర్ 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక, రామడుగు 38.8, సైదాపూర్ 38.7, శంకరపట్నం, గన్నేరువరం 38.4, హుజూరాబాద్ 38.2, కొత్తపల్లి 38.1, కరీంనగర్ రూరల్ 37.9, ఇల్లందకుంట 37.7, చొప్పదండి 37.6°C గా నమోదైంది.