Karimnagar

News September 11, 2024

ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్

image

సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్‌లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.

News September 11, 2024

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రామగుండం MLA

image

హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

News September 11, 2024

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

image

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.

News September 11, 2024

కొండగట్టులో మహిళ అఘోరీ

image

ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్‌లోని మాతాకీ శిఖర్‌‌లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. బుధవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువు (అఘోరీ)గా మారినట్లు పేర్కొన్నారు.

News September 11, 2024

కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు ఆరేళ్లు!

image

కొండగట్టు రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ఘటనకు నేటితో ఆరేళ్లు పూర్తైంది.108 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాటు రోడ్డు లోయలో పడి 65 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడి జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే ఆతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1.50 కోట్లు వెచ్చించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల రక్షణ గోడలు, తక్కువ ఎత్తుతో వేగనియంత్రికలు నిర్మించింది.

News September 11, 2024

మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ

image

మారుమూల ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట, సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు.

News September 10, 2024

జగిత్యాల: మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలోని సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపెర్వైజర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో డెంగీ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందని పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలనీ, పిచ్చి మొక్కల్ని తొలిగించి జ్వరాలు వచ్చే చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 10, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

News September 10, 2024

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్‌లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

News September 10, 2024

కరీంనగర్: ఏరియా ఆసుపత్రులకు గుర్తింపు.. నిధులు కరవు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఎన్క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇక్కడి వైద్యులు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో పాటు చక్కటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తింపు లభించింది. అయితే మంచి సేవలు అందిస్తున్నప్పటికీ ఈ ఆసుపత్రులకు నిధులు మాత్రం కరవయ్యాయి.