India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నూతనంగా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల (FPOs) కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య హాజరై, రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ పాత్రను, రైతులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
42 శాతం బీసీ బిల్లుకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, HZB కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. BCలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నేతలన్నారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
KNR బీసీ స్టడీ సర్కిల్లో విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో “ఆపద మిత్ర” 3వ దఫా శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు హాజరయి మాట్లాడుతూ.. విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు KNR జిల్లాలో మూడు బ్యాచీలుగా సుమారు 300 మందికి “ఆపదమిత్ర” శిక్షణ ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా KNR జిల్లాలో శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందన్నారు.
చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం
ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు నమోదును పరిశీలించారు. బరువు తక్కువున్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అదనపు రేషన్ ఇవ్వాలని సూచించారు. పిల్లలు ఎవరైనా అతిగా లేదా తక్కువ బరువుంటే వారిని గుర్తించి KNR ఎన్ఆర్సీ కేంద్రానికి రిఫర్ చేయాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని KGBVలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల హాజరు 85 శాతానికి తగ్గకుండా ఉండాలని, క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలని అన్నారు.
కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత అంశంలో భాగంగా మంగళవారం యువ వేదిక బూట్ క్యాంప్ను నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు స్టార్టప్ ఆలోచనలు, నైపుణ్యాలు, స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చారు. ప్రిన్సిపల్ డా.కె.రామకృష్ణ సహా పలువురు అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. దీని ద్వారా యువతలో నాయకత్వం, సృజనాత్మకత పారిశ్రామిక దృక్పథం పెరుగనున్నాయి.
జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జాతీయ స్థాయిలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్ను మెరుగుపరిచేందుకు యూనిసెఫ్ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో యూనిసెఫ్ బృందంతో ఆమె సమావేశం నిర్వహించారు. పాఠశాలల ర్యాంకింగ్ మెరుగుపరచడంలో యూనిసెఫ్ సహాయం కోరారు. దీనికి స్పందించిన బృందం సభ్యులు, జిల్లాలో విద్య, వైద్యం, అంగన్వాడీ శాఖలలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి 290 దరఖాస్తులు వచ్చాయి. అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాటి పరిష్కారం కోసం జిల్లా అధికారులకు బదిలీ చేశారు. వివిధ విభాగాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.
Sorry, no posts matched your criteria.