India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తపల్లి-ధర్మారం 37.7°C నమోదు కాగా, తాంగుల, ఈదులగట్టేపల్లి, బురుగుపల్లి, ఇందుర్తి 37.6, జమ్మికుంట, మల్యాల 37.5°C, నుస్తులాపూర్ 37.3, కరీంనగర్ 37.1, వీణవంక, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 36.9, గంగిపల్లి 36.8, తాడికల్ 36.5, బోర్నపల్లి 36.1, దుర్శేడ్, చింతకుంట, గుండి 36.0°C గా నమోదైంది.
ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో అనేక పోరాటాలు విద్యార్థి సంఘ నాయకులు చేశారు. శాతవాహన యూనివర్సిటీకి ఈ రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్కు వచ్చారు. అయితే, సర్వర్లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్పై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
కరీంనగర్లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్కు వివరించారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
KNR పట్టణంలో నేడు వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తపస్ ఎమ్మెల్సీ అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు. తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన అవేర్నెస్ పార్కును మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. అనంతరం KNRలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. BRS KNR ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కరీంనగర్కు రానున్నారు.
కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.
Sorry, no posts matched your criteria.