Karimnagar

News September 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్ల కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం. @ మల్యాల మండలంలో నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్య. @ పెద్దపల్లి జిల్లాలో 67 డెంగ్యూ కేసులు నమోదు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు గురుబ్రహ్మ అవార్డు. @ మట్టి గణపతులను ఏర్పాటు చేయాలన్న జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎత్తు, బరువు తప్పకుండా చూడాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News September 4, 2024

సిరిసిల్ల: కేంద్రాల్లో పిల్లల ఎత్తుబరువు తప్పనిసరిగా కొలవాలి : కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఒక చోట చేర్చి, వీహెచ్ఎస్ఎన్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలిచారు. ఈరోజు కేంద్రానికి రాని వారికి రేపు కొలవాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 4, 2024

ఈడీ కేసు మాఫీ కోసమే.. దిల్లీలో గంగుల పొర్లు దండాలు: వెలిచాల

image

ఈడీ కేసు నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ చుట్టూ పొర్లుదండాలు పెడుతూ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్‌రావు ఆరోపించారు. ప్రజల సంక్షేమం మరిచి ఆయన వారానికోసారి దిల్లీకి వెళ్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి కేసుల నుంచి విముక్తి కల్పించాలని ప్రాధేయ పడుతున్నారని ఆయన ఆరోపించారు.

News September 4, 2024

జగిత్యాల : మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మట్టి విగ్రహాల పోస్టర్లను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్నారు. జిల్లాలో 2000 మట్టి విగ్రహాలను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు.

News September 4, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో నవ వరుడి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన నవీన్(27), భూమేశ్వర్, పార్థసారథిలు మాచాపూర్ నుంచి గుంలాపూర్ వైపునకు బైకుపై వెళ్తూ గ్రామశివారులో ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే నెల క్రితమే సింగపూర్ నుంచి వచ్చిన నవీన్‌కు గతనెల 18న పెళ్లయింది.

News September 4, 2024

శ్రావణ మాసం.. రాజన్నకు రూ.6కోట్ల 87 లక్షల ఆదాయం

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి శ్రావణ మాసం సందర్భంగా ఆయా ఆర్జిత సేవల ద్వారా రూ.6 కోట్ల 87 లక్షల 22 వేల 90లు సమకూరినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అభిషేకం టికెట్ల ద్వారా రూ.21,16,500, కల్యాణాల టికెట్ల ద్వారా రూ.34 లక్షల 44 వేలు, కేశఖండనం ఒకటవ కౌంటర్ ద్వారా రూ.12,12,450, వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆదాయం సమకూరినట్టు చెప్పారు.

News September 4, 2024

జగిత్యాల: విష జ్వరంతో కోనాపూర్ పీఎసీఎస్ సీఈవో మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన రాజ్ కుమార్(27) విష జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడు కొనాపూర్ పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నాడు. తల్లి కొమురక్క సైతం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొడుకు అంత్యక్రియల నిమిత్తం తల్లిని ఆస్పత్రి నుంచి తీసుకురావడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.

News September 4, 2024

విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దు: కేంద్ర మంత్రి

image

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పట్టణంలో గణేశ్ మండపాలకు అయ్యే ఖర్చు అంతా తానే చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వినాయక మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు.

News September 4, 2024

KNR: భారీ వర్షం.. ఇళ్లలోకి నీరు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 3రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగాధర మండలం మధురానగర్‌కు సమీపంలోని కుడి కాలువ తెగి వరద నీరు ఇళ్లలోకి, వీధుల్లోకి చేరింది. ఐదేళ్లుగా వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 9వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 ఇళ్లలోకి నీరు చేరిందని, సాగునీటి పారుదల శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News September 4, 2024

చేనేత వస్త్రాలను ఉపయోగించాలి: మంత్రి పొన్నం

image

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలు, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేనేత వస్త్రాలను ఉపయోగిస్తే నేతన్నలందరికి ఆర్థికంగా సహకరించినట్లు ఉంటుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలని వాడాలని, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.