India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయనకు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంకల్పమే బలంగా, జనహితమే ధ్యేయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి కృపతో ఎల్లప్పుడు ప్రజాసేవలో తరించాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశారు.
గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం తదితర ప్రధాన ప్రాంతాలలో కొత్తిమీర కిలో రూ.250 పెరిగింది. సాధారణ రోజుల్లో కిలో వంద రూపాయలు ఉండే కొత్తిమీర ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంది.
భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఆపద, ఇతర ఇబ్బందులు వస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూం నెంబర్ 1800 599 5459కు కాల్ చేయాలన్నారు. 24 గంటల పాటు పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు.
@ మేడిపల్లి, కోరుట్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్లు.
@ భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల, జగిత్యాలలో రేపు జరగనున్న ప్రజావాణి రద్దు.
@ జగిత్యాల జిల్లాలో 215 డెంగీ కేసులు నమోదు.
@ మెట్పల్లి పట్టణంలో విరిగిపడిన చెట్టు.. తప్పిన ప్రమాదం.
భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు ఎప్పటికి అప్పుడు వరద పరిస్థితిని సమీక్షి స్తున్నారన్నారు. ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో ఆయన విలేఖరుల సమవేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణ మాఫీ చేశామని చెబుతున్నా.. అది పూర్తి స్థాయిలో జరగలేదని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరావాస చర్యలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో శునకాల సంతతి నియంత్రించేందుకు పశుసంవర్ధకశాఖ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల్లో జంతు సంతతి నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి శునకాల గణన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 11,748 పెంపుడు, 35,990 వీధి కుక్కలు కలిపి మొత్తం 47,738 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో నేరెళ్ళ గుట్ట వద్ద వంతెనపై భారీగా వరద నీరు పొంగిపొర్లుతోంది. వరద నీటి ప్రవాహం కారణంగా జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య వాహనాల ప్రయాణాలు, రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.