Karimnagar

News September 1, 2024

మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద

image

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా అధికారులు 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 2.60 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 1, 2024

జగిత్యాల: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ శనివారం కోరారు. రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాలు ఉన్నాయని, వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండలా ఉన్నాయన్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత, జాలర్లు సెల్ఫీ కొరకు వెళ్లొద్దని అన్నారు.

News August 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గోదావరిఖనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బోల్తా పడిన మినీ వ్యాన్.
@ గోదావరిఖనిలో కారును ఢీ కొట్టిన లారీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షం.
@ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.

News August 31, 2024

రేపు ఉమ్మడి KNR జిల్లా సైక్లింగ్ పోటీలు

image

కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా సైక్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో అండర్-14, 16, 18, 23, 23పై సంవత్సరాల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని ప్రాంతీయ స్థాయి ఖేలో ఇండియా, రాష్ట్ర స్థాయి రోడ్డు సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

News August 31, 2024

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని అధికారులతో శనివారం అయన టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చెరువులు, కుంటల పైపు పిల్లలు, యువత జాలర్లు వెళ్లకుండా చూడాలన్నారు. వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు నివసించకుండా చూడాలన్నారు. ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2024

రామగుండంకు బస్సులు ఇస్తా: మంత్రి పొన్నం

image

రామగుండంను అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక MLA మక్కాన్ సింగ్ ఠాగూర్ పనిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గోదావరిఖని బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ రామగుండంకు బస్సులు కావాలని అడిగడంతో.. వారి కోరిక మేరకు బస్సులు పంపిస్తానని హామీ ఇచ్చారు.

News August 31, 2024

వేములవాడ: రంగు మారుతున్న ధర్మగుండం నీళ్లు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీళ్లు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీళ్లు తొలగించాలని కోరుతున్నారు.

News August 31, 2024

విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై డిప్యూటీ సీఎం సమావేశం

image

రామగుండంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల విద్యుత్ కేంద్ర స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై కొన్ని విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హార్కార వేణుగోపాల్ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు.

News August 31, 2024

గోదావరిఖనిలో కారును ఢీకొన్న లారీ

image

గోదావరిఖని గంగానగర్ పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్తున్న లారీ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఓ బ్యాంకు మేనేజర్‌కు చెందిన కారుగా గుర్తించారు.

News August 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు RED ALERT⚠️

image

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.