India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేసిన బల్లార్షా-కాజీపేట-బల్లార్షా మధ్యలో నడుస్తున్న రైలు నంబర్ 17035,17036 ప్యాసింజర్ తిరిగి ఈ నెల 6 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి రాజనర్సు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, ఉప్పల్, బిజిగిరిషరిఫ్ ప్రాంతాలవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటినుంచి కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికి 40 మంది ఎలిమినేషన్ అయినట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 17.799, సెకండియర్లో 17763 మంది విద్యార్థులు రాయనుండగా.. 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST
గడచిన 24 గంటల్లో నుస్తులాపూర్, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి, ఖాసీంపేట, గుండి, గంగిపల్లి, మల్యాల 39.2°C, పోచంపల్లి, కరీంనగర్ 39.1, తాంగుల 39.0, ఇందుర్తి 38.9, గంగాధర 38.7, జమ్మికుంట, దుర్శేడ్ 38.6, వీణవంక 38.3, రేణికుంట 38.1, చిగురుమామిడి, బురుగుపల్లి, చింతకుంట 37.9, గట్టుదుద్దెనపల్లె 37.8, వెంకేపల్లి, ఆసిఫ్ నగర్ 37.6, బోర్నపల్లి 37.5, వెదురుగట్టు 37.2, తాడికల్ 35.7°C గా నమోదైంది.
KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
కొండాపూర్ గ్రామానికి చెందిన చీకుట్ల రాజు అనే రైతు లేగ దూడపై హైనా దాడి చేసింది. రోజులాగే తన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను కట్టివేసి ఇంటికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి లేగ దూడ చనిపోయియిందన్నాడు. హైనా చంపిన ఆనవాళ్లను గుర్తించామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతుకోరాడు. రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కంచె ఏర్పాటు చేసుకోవాలని ఫారెస్ట్ అధికారి శేఖర్ రైతులకు తెలిపారు.
కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో బురుగుపల్లి, కొత్తపల్లి-ధర్మారం 38.6°C, జమ్మికుంట 38.5, కరీంనగర్ 38.0, ఇందుర్తి, తాంగుల 37.6, ఖాసీంపేట, వీణవంక 37.4, మల్యాల 36.9, ఈదులగట్టేపల్లి 36.8, అర్నకొండ 36.6, నుస్తులాపూర్ 36.5, గుండి 36.3, గంగాధర 36.2, గంగిపల్లి, పోచంపల్లి, చింతకుంట 36.1, బోర్నపల్లి 36.0, ఆసిఫ్ నగర్, దుర్శేడ్ 35.8, గట్టుదుద్దెనపల్లె 35.4°C గా నమోదైంది.
PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.