Karimnagar

News August 31, 2024

పెద్దపల్లి: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. భద్రాచలం రోడ్‌-బళ్లార్ష, బళ్లార్ష-కాజీపేట వరకు SEP 29 నుంచి OCT 8 వరకు అంతరాయం కలగనుంది.

News August 31, 2024

కరీంనగర్: రూ.2.75 కోట్ల సొమ్ము రికవరీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. దీంతో పోలీసులు విలువైన సమాచారాన్ని అందించారు. నష్టం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేసినా (డైమండ్ అవర్), నిమిషంలోపు ఫిర్యాదు చేసినా (గోల్డెన్ అవర్) సంబంధిత సొమ్మును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.2.75 కోట్లు రికవరీ చేశారు. గంటలోపే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News August 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముస్తాబాద్ మండలంలో కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్. @ కరీంనగర్ లో కార్ల షోరూంలో చోరీ. @ జగిత్యాల జిల్లాలో 211 డెంగీ కేసులు నమోదు. @ కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు శిక్ష. @ గంభీరావుపేటలో వడ్డీ వ్యాపారిపై కేసు.

News August 30, 2024

HZB: 4,661 రైతులు రుణమాఫీకి దూరం

image

హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఏడీఏ సునీత తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 4,661 రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ఇందులో రేషన్ కార్డు లేని వారు, తదితర కారణాలతో మాఫీ కాలేదన్నారు. ఇంటింటికి సర్వే చేసి వివరాలు సేకరిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని, అందులో వివరాలు నమోదు చేస్తున్నామన్నారు.

News August 30, 2024

రామగుండం: పరిశ్రమలు ఉన్నా ఉద్యోగాలు లేవు.!

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు కరువయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. RFCL, సింగరేణి, మెడికల్ కాలేజీ, NTPC, బీ-థర్మల్, కేశోరాం లాంటి పరిశ్రమలు ఉన్నాయి.

News August 30, 2024

కరీంనగర్: గణపతి ప్రతిమలు ‘సిద్ధం’

image

ఉమ్మడి జిల్లాలో గణపతి మండప నిర్మాణాలు జోరందుకున్నాయి. విక్రయ కేంద్రాల్లో ప్రతిమలు సిద్ధంగా ఉన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని పలువురు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఏటా 200కు పైగా మట్టి విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని రూ.12 లక్షలు వెచ్చించి రూపొందిస్తుండడం విశేషం.

News August 30, 2024

కరీంనగర్: భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

image

కరీంనగర్ పట్టణ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా ప్రమాదాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య DCMలు, వాటర్ ట్యాంకర్లు, RMCలు, రాకెట్ లారీలు, JCBలు, ఎర్త్ మూవర్‌, ట్రాక్టర్లు, భారీ మోటార్ వాహనాలకు పట్టణంలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

News August 30, 2024

‘ఆరోగ్య మహిళ’ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రతి మహిళ స్థానికంగా ఉన్న ఆరోగ్య మహిళ క్లినిక్‌కి వెళ్లి సుమారు 50 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో శుక్రవారం సభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళా క్లినిక్‌లో రూ. 45 వేల ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు, క్యాన్సర్ వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తారని తెలిపారు. మహిళలకు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News August 30, 2024

కరీంనగర్: ఏజెంట్ల మోసాలు.. గల్ఫ్‌లో కష్టాలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంపెనీ నిబంధనలు పాటించకుండా చాలా మంది చిక్కుల్లో పడుతున్నారు. మరోవైపు నకిలీ ఏజెంట్లతో చాలా మంది మోసపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ ఏజెంట్ల బారిన పడవద్దని, మోసం జరిగితే ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నారు.

News August 30, 2024

సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన రాజన్న ఆలయ అర్చకులు

image

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎంను ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ తదితరులు కలిశారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ ‌లో రూ.50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.