India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో బురుగుపల్లి, కొత్తపల్లి-ధర్మారం 38.6°C, జమ్మికుంట 38.5, కరీంనగర్ 38.0, ఇందుర్తి, తాంగుల 37.6, ఖాసీంపేట, వీణవంక 37.4, మల్యాల 36.9, ఈదులగట్టేపల్లి 36.8, అర్నకొండ 36.6, నుస్తులాపూర్ 36.5, గుండి 36.3, గంగాధర 36.2, గంగిపల్లి, పోచంపల్లి, చింతకుంట 36.1, బోర్నపల్లి 36.0, ఆసిఫ్ నగర్, దుర్శేడ్ 35.8, గట్టుదుద్దెనపల్లె 35.4°C గా నమోదైంది.
PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర 37.6°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.5, జమ్మికుంట 37.4, నుస్తులాపూర్ 37.2, కరీంనగర్, బురుగుపల్లి 36.9, ఖాసీంపేట 36.8, గుండి 36.1, కొత్తపల్లి-ధర్మారం 35.9, వీణవంక 35.8, తాంగుల 35.6, అర్నకొండ 35.4, పోచంపల్లి, ఇందుర్తి 35.2, మల్యాల 35.0, తాడికల్, రేణికుంట 34.9, దుర్శేడ్, గట్టుదుద్దెనపల్లె 34.8°C గా నమోదైంది.
ఈనెల 6 నుంచి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయమని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు.
కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి ముందు ఫుట్ పాత్పై గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్న వృద్ధుడు, అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని ఎవరైనా గుర్తుపడితే కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
మార్చి 5 నుంచి 25 జిల్లాలో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 17799 మంది, రెండో సంవత్సరంలో 17763 మొత్తం 35562 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందుకుగాను 37 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల బాక్స్లు నిల్వచేసిన స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా ఇతర ముఖ్యఅధికారుల సమక్షంలో సీల్ వేశామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్స్లను వేరువేరుగా భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్లో ఈతకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ తిరుపతి రావు (59) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రోజూలాగే ఉదయం స్నేహితులతో ఈతకు వెళ్లిన తిరుపతి రావు ప్రమాదవశాత్తు మృతి చెందాడని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు.
ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 34.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఉదయం, రాత్రి సమయాల్లో చలి పెడుతోంది.
Sorry, no posts matched your criteria.