Karimnagar

News August 25, 2025

KNR: ‘విద్యార్థులు 100 శాతం హాజరు ఉండాలి’

image

మానకొండూర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం మంది విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని అన్నారు. పాఠశాల బాలికలు తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించి అభినందించారు. అనంతరం 8వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.

News August 25, 2025

జమ్మికుంట: మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ

image

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా జరిగింది.

News August 25, 2025

KNR: ‘నానో యూరియాను పిచికారీ చేయాలి’

image

కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి J.భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం ఎరువుల డీలర్ల సమావేశం నిర్వహించారు.
నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలని వివరించారు. వరి పంట ఎదుగుదల దశలో ఉన్నందున, రైతులు ఒక బస్తా యూరియాకు బదులుగా 500 మి.లీ. నానో యూరియాను పిచికారీ చేసుకోవడం ద్వారా తక్కువ ధర, సులభమైన రవాణాతో అధిక దిగుబడి సాధించవచ్చని ఆమె సూచించారు.

News August 25, 2025

LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:MLA

image

భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య 1964 బ్రాంచ్–2, కరీంనగర్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఏజెంట్ల సమస్యలు, భవిష్యత్తు బీమా విధానాలు, ప్రజల్లో బీమా అవగాహన పెంపొందించడంలో ఏజెంట్లు పోషిస్తున్న కీలకపాత్రపై విశదీకరించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

News August 24, 2025

మానకొండూరు ఎమ్మెల్యేను పరామర్శించిన మీనాక్షి నటరాజన్

image

మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

News August 24, 2025

కరీంనగర్ జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

image

కరీంనగర్ జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య, జాతీయ కో-ఆర్డినేటర్ కొల్లూరి మల్లేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మండల అధ్యక్షుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News August 24, 2025

మైనార్టీ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు

image

కరీంనగర్ విట్స్ క్యాంపస్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల(బాలురు), రేకుర్తిలోని తెలంగాణ మైనార్టీస్ గురుకుల కళాశాల(బాలికల) కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ కోర్సులకు ఉచిత శిక్షణలో భాగంగా ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు మైనార్టీ గురుకులాల సమన్వయకర్త కే.నరేష్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనునట్లు తెలిపారు.

News August 24, 2025

KNR: ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు AUG 30 చివరితేదీ

image

2025- 26 విద్యా సం.కి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి, కో- ఆర్డినేటర్ డా.మనోజ్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్, ఐఐటీ, డిప్లొమా విద్యార్థులు TS ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి రశీదు పొందాలని సూచించారు. ఇతర వివరాల కోసం 7382929755ను సంప్రదించాలన్నారు.

News August 24, 2025

గర్షకుర్తిలో రూ.70 లక్షల అప్పు చేసి వ్యాపారి పరారీ

image

గంగాధర(M) గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్‌టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకు పైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News August 24, 2025

చొప్పదండి: అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

image

వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మండపం వద్ద లైవ్ విద్యుత్ కనెక్షన్లను పరిశీలించాలని, మండపంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రి ప్రమాదాల నివారణకు ఎస్‌ఎఫ్‌ఓ 8712699247,8712699246 సెల్ నంబర్లతో టచ్‌లో ఉండాలని కోరారు.