India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.
బతుకుదెరువు కోసం గల్ఫ్కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వర్క్ పూర్తిచేయాలని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన ప్రణాళికతో అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. పొరపాటులకు తావివ్వరాదని అన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసే ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు.
అపర భద్రాది గా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల 16 న బుధవారం స్వామి వారికి రాత్రి 9గంటలకు సప్త వర్ణాలు, మరియు అద్దాల మేడ దాతల చే స్వామి వారి ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ ఇంగిలి రామా రావు, ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృప కు పాత్రులు కావాలని పేర్కొన్నారు .
జమ్మికుంట<<16108193>> ఫ్లైఓవర్ యాక్సిడెంట్<<>> మృతుడి వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గకాలనీకి చెందిన పూరంశెట్టి తిరుపతి (39)గా జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. మృతునికి భార్య సృజన, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి 100 శాతం ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని కలెక్టర్ అన్నారు.
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా శంకరపట్నం మండలంలో 39.3°C నమోదు కాగా, చిగురుమామిడి 39.2, గన్నేరువరం 38.9, జమ్మికుంట 38.7, మానకొండూరు, గంగాధర 38.5, తిమ్మాపూర్ 38.4, రామడుగు, కరీంనగర్ 38.3, కరీంనగర్ రూరల్ 38.2, వీణవంక 37.8, సైదాపూర్ 37.6, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.7, కొత్తపల్లి 36.6, ఇల్లందకుంట 36.5°C గా నమోదైంది.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వారి వెంట జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.