India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గురువారం కలిశారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా కరీంనగర్లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. వీరి వెంట నిశాంత్ రెడ్డి, దినేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. @ శంకరపట్నం మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి. @ కరీంనగర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. @ జగిత్యాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ గంభీరావుపేట మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా విశ్వహిందూ పరిషత్, హిందూ ఐక్యవేదిక శుక్రవారం హుజూరాబాద్ బంద్కు పిలుపునిచ్చాయి. వ్యాపార సంఘాలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్కు సహకరించాలని విశ్వహిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ కనకం శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ కంకణాల రమేశ్ రెడ్డి, హిందుత్వవాది గంగిశెట్టి రాజు కోరారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉల్లి, అల్లం తీస్తున్నారని, ఇప్పుడు బ్రేక్ డాన్సులు చేసుకోమని అవమానపరిచిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శిరీష(30) అనే గర్భిణీ ప్రసవం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. అయితే ప్రసవించిన కొద్ది గంటల్లోనే తల్లీ కుమార్తెలు మరణించారు. డెంగ్యూ లక్షణాలతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్రం దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 140 మందికి ఉద్యోగులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, MLA విజయరమణారావుతో కలిసి అందజేశారు.
KNR జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లో నేడు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200లోపు యూనిట్ల వారికి ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ అభిషేక్ తదితరులు ఉన్నారు.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తీరంగా కార్యక్రమంతో దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. యావత్ భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి, జాతి మొత్తం సగర్వంగా త్రివర్ణ పతాకం వైపు చూసేలా చేసిందని తెలిపారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు 477.51 అడుగులకు గాను ప్రస్తుతం 13.87 టిఎంసిలు నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 2,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 3,810 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.