India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో మరో 10 నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 313 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వసతులు, పాలనా సౌలభ్యం చేరువ కావడానికి రాష్ట్ర సర్కార్ కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయనుంది. నిబంధనల మేరకు జిల్లాలో 10 చోట్ల అవకాశముందని గెజిట్ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 313 ఉండగా కొత్తగా పది నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో వాటి సంఖ్య 323 కానుంది.
కరీంనగర్ ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై పలు శాఖల అధికారులతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమావేశం నిర్వహించారు. కరీంనగర్లోని ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్నారు. సీసీ కెమెరాలను సంఖ్యను పెంచి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట్ల మాత్రమే యూ టర్న్ల ఏర్పాటు చేయాలని తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలను కలెక్టర్ పమేల, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన భోజనం అందుతుందా అని విద్యార్థులను అడిగారు.
మహిళల ఆర్థిక క్రమశిక్షణతోనే కుటుంబాలలో వెలుగులు నిండుతాయని, అందుకే ప్రతి మహిళ సాధికారత వైపు ప్రయాణించి కుటుంబాలను బాగు చేసుకుంటూ స్వశక్తితో ఎదగాలని మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రేగులపల్లి గ్రామంలోని ఓ మహిళా గ్రూపుకు చెందిన మాతంగి భారతి అనే మహిళ స్వయం సహాయక నిధి నుంచి రూ.5లక్షల అప్పు తీసుకుని ఏర్పాటు చేసుకున్న పిండి గిర్నిని బుధవారం MLA ప్రారంభించారు.
జగిత్యాల పట్టణంలోని 46వ వార్డులో నేడు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య భవనాన్ని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, MLC జీవన్ రెడ్డి, MP ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై వేర్వేరు పార్టీల MLA, MLC, MLC పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి తదితరులు ఉన్నారు.
మెట్ పల్లి పట్టణంలోని ఓ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కాగా, పోలీసులు 18 గంటల్లోనే కేసును ఛేదించారు. నిన్న కిడ్నాప్ జరిగిన సమయం నుంచి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కనుగొన్నారు. బాలుడిని అమ్మక్కపేట శివారులోని అర్బన్ కాలనీ వద్ద కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.
సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్(45) అనే రైతు హఠాన్మరణం చెందారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి చేనుకు పురుగు మందు పిచికారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో బీపీ డౌన్ అయ్యి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శాతవాహన వర్సిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. వర్సిటీ అధికారులు విచారణ అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వలేదని.. దీనిపై మరోసారి వర్సిటీ బాధ్యులకు విజిలెన్స్ లేఖ కూడా రాయనుంది. కాగా, వర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజ్ ఉంది.
షేక్ హసీనాను భారత్కు రానిచ్చారు కానీ అక్కడ బాధపడుతున్న హిందువులను బార్డర్లో అడ్డుకుని, ఎందుకు రానివ్వడం లేదని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు జీ.నిరంజన్ గాంధీభవన్లో ప్రశ్నించారు. బండి సంజయ్కు దమ్ముంటే జవాబు చెప్పాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే చైనా ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బండిని కేబినెట్ నుంచి తొలగించాలన్నారు.
కరీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్గా పని చేస్తున్న డాక్టర్ ఆర్.లలిత మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ బెస్ట్ ఉమన్ లైబ్రేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల చెన్నైలో జరిగిన నేషనల్ లైబ్రేరియన్ డే వేడుకల్లో అవార్డును అందుకున్నారు. కళాశాలలో లలితను ప్రిన్సిపల్ మాలతి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సన్మానించింది. వైస్ ప్రిన్సిపల్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.