Karimnagar

News February 2, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.

News February 2, 2025

జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

image

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.

News February 1, 2025

KNR: రేపు కళాభారతిలో రాష్ట్ర దివ్యాంగుల పట్టభద్రుల సంఘం వార్షికోత్సవం

image

KNR కళాభారతిలో రాష్ట్ర దివ్యాంగుల పట్టభద్రుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆదర్శ దివ్యాంగుల ఆత్మీయ అభినందన సభను రేపు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జగదీశ్వరాచారి తెలిపారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారిని దివ్యాంగ స్వయం కృషి అవార్డుతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. దివ్యాంగ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News February 1, 2025

కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

image

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News February 1, 2025

కరీంనగర్: నిర్మలమ్మ పద్దుపైనే ఆశలు..!

image

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై KNR జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి, కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడిచే విధంగా చర్యలు, జిల్లాలో భారత్ మాల పథకంలో జాతీయ రహదారుల విస్తరణ, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

News February 1, 2025

జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

News January 31, 2025

కరీంనగర్: ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు

image

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని కరీంనగర్ జిల్లా పమేలా సత్పతి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతినెల అవగాహన కల్పించాలని రవాణాశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.

News January 31, 2025

చొప్పదండి: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

చొప్పదండి నవోదయ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో ధర్మపురికి చెందిన పసుపునుటి భారతి (60) అనే మహిళ మృతి చెందింది. భారతి తన కుమారుడు చంద్రశేఖర్ తో కరీంనగర్ వైపు బైక్‌పై వస్తుండగా హఠాత్తుగా మేక అడ్డు రావడంతో సడేన్ బ్రేకు వేశాడు. దీంతో రోడ్డుపై పడిన భారతికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. చొప్పదండి ఎస్‌ఐ గొల్లపల్లి అనూష కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 31, 2025

కుంభమేళాలో జగిత్యాలకు చెందిన మహిళలు మిస్సింగ్

image

జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన నరసవ్వ (55) కుటుంబ సభ్యులతో, కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) తన బంధువులతో కలిసి ఈ నెల 29న మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా నరసవ్వ, రాజవ్వ ఇద్దరు మిస్సయ్యారు. అయితే, వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.