India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో బీ-ఫామ్ ఎవరికీ దక్కనుందని అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాలను ఎంపికలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్ఠానం గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని బీ-ఫామ్ కేటాయించనున్నారు. కొందరు ఆశావహులు పార్టీలు మారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో చివరి క్షణం వరకు చూడాలి.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 66 డివిజన్లకు 33 ఆర్వో కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తంగా 140 వార్డులకు 450 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,31,722 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: 66 వార్డులు- 3,40,580 ఓటర్లు, జమ్మికుంట: 30 వార్డులు- 38,120 ఓటర్లు, హుజూరాబాద్: 30 వార్డులు- 36,442 ఓటర్లు, చొప్పదండి:14 వార్డులు-16,580 ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి.

కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన వివేక్ రెండు రోజుల క్రితం అదృశ్యం అవ్వగా.. నేడు సైదాపూర్ మండలం సోమారం శివారులోని కాకతీయ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలం కరింపేటకి చెందిన సాదుల అనిల్ మూడు రోజుల క్రితం కాకతీయ కాలువలో గల్లంతవ్వగా.. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులో అనిల్ మృతదేహం లభ్యమైంది.

శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై అర్ధరాత్రి 2 కార్లు ఢీకొన్నాయి. వేములవాడ దర్శనం చేసుకుని వరంగల్ వెళుతున్న ఎర్టిగా కార్ కేశవపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు కార్ల ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు.

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతయ్యాడు. పొలం పనుల అనంతరం కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఎస్సారెస్పీ అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం వార్షిక డీ-మొబిలైజేషన్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం సిబ్బంది వందనాన్ని స్వీకరించారు. శిక్షణతోనే వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు. నెల రోజులుగా ఆయుధాల వినియోగం, భద్రతా నియమాలు, ఫైరింగ్పై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.