India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఓటర్ల అవగాహన, సిబ్బందికి శిక్షణ, పారదర్శక ఎన్నికల ప్రక్రియలో చూపిన వినూత్న కృషికి ఈ గౌరవం దక్కింది. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమష్టి కృషి అని కలెక్టర్ పేర్కొన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో TGMDC MD భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇకపై ఇసుక బుకింగ్ను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, CP గౌస్ ఆలం సమక్షంలో తహశీల్దార్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నిఘాపెంచి, అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన టెడ్ టాక్స్తో నిర్వహించిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడం జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఉద్యోగాలు రాని కొడుకులు.. వసూలు కాని అప్పులతో మనస్తాపం చెందిన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్(D) మానకొండూరు మండలం అన్నారానికి చెందిన శంకరాచారి (58) శనివారం తేజాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడం, ఇచ్చిన అప్పుల వసూలుకావడం లేదనే బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.

తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఫైర్ & సేఫ్టీ, వెబ్ & గ్రాఫిక్ డిజైనింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తానమని దరఖాస్తులు చేసుకోవలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులు. దరఖాస్తులను పిబ్రవరి 9 వరకు జిల్లా మైనార్టీ ఆఫీసులో సమర్పించాలని సూచించారు.

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

కరీంనగర్ ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీబీ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఇంటర్ ఆపై చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్స్ జిరాక్సు కాపీలతో కశ్మీర్గడ్డలోని ఈసేవ పైఅంతస్తున గల ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ పోలీసు కమిషనరేట్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ‘శౌర్య’ ఇండోర్ గేమ్స్ హాల్ను సీపీ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం పాత భవనాన్ని పునరుద్ధరించి టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారమ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.