India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లవ్ ఫెయిల్యూర్తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన వివేక్(21) మంచిర్యాల జిల్లాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఉరేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కరీంనగర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక అధికారులతో బుధవారం సందర్శించారు. ఈ సంధర్బంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. విలీన గ్రామపంచాయతిలలో నియమించిన ప్రత్యేక అధికారులు అన్ని రికార్డులను ప్రొఫార్మా ప్రకారం తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిపారు. విలీన గ్రామాలకు నగరపాలక సంస్థ వార్డుగా బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు.
కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసెంజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.
హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన సాయి చందన(21) ఈనెల 26న హాస్టల్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు, యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
ఎల్.ఆర్.ఎస్ 2020 పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులపై ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అదనపు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. ఎంపీఓలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజనీర్లు సమన్వయంతో పని చేయాలన్నారు.
కరీంనగర్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడోత్సవాల్లో భాగంగా మంగళవారం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ఇంటెలిజెన్స్ డిజి శివధర్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఏడేళ్ల అనంతరం జరుగుతున్న మూడో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోలీస్ ఉద్యోగం అంటేనే ఎంతో ఒత్తిడితో కూడిన ఉద్యోగం అని, ఇలాంటి పోటీల్లో ఉపశమనం కలుగుతుందన్నారు.
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరం తేదీలను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆర్థోకి సంబంధించిన వారు ఫిబ్రవరి 3, 4 & మార్చి 4, మానసిక రోగులు ఫిబ్రవరి 6 & మార్చి11, కంటి చూపు ఫిబ్రవరి 10 & మార్చి 18న, చెవిటి మూగవారికి ఫిబ్రవరి 13 & మార్చి 24 తేదీలలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీసేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకొని నిర్ధారించిన తేదీలో రసీదు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కరీంనగర్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో నిర్వహించే క్రీడలు ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో,వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్ బ్యాట్మెంటన్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా, తదితర 29 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించనున్నారు.
KNR జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నిన్న ప్రమాదాలకు అడ్డాగా మారింది. సోమవారం నియోజకవర్గంలో 3 యాక్సిడెంట్స్ జరిగాయి. కమలాపూర్ మండలంలో బస్సు, ట్రాలీ ఢీకొనగా 13 మంది గాయపడ్డారు. HZB మండలం రంగాపూర్లోని జూపాక క్రాస్ రోడ్డులో రెండు బైకులు ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి. HZB మండలం మందాడిపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. HZBకు సమీపంలోని ఎల్కతుర్తిలో లారీ ఢీకొని ఒకరు మృతిచెందడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.