India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి మధునయ్య విషపురుగు కుట్టి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేస్తున్న మధునయ్యను జనవరి 26న ఏదో విషపురుగు కుట్టింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 15 జిల్లాలు, 35 డివిజన్లు, 271 మండలాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు 499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లలో ఆర్డీవోలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 274 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మెట్పల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, మెట్పల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
లవ్ ఫెయిల్యూర్తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన వివేక్(21) మంచిర్యాల జిల్లాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఉరేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కరీంనగర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక అధికారులతో బుధవారం సందర్శించారు. ఈ సంధర్బంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. విలీన గ్రామపంచాయతిలలో నియమించిన ప్రత్యేక అధికారులు అన్ని రికార్డులను ప్రొఫార్మా ప్రకారం తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిపారు. విలీన గ్రామాలకు నగరపాలక సంస్థ వార్డుగా బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు.
కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసెంజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.
హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన సాయి చందన(21) ఈనెల 26న హాస్టల్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు, యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Sorry, no posts matched your criteria.