Karimnagar

News August 13, 2024

జగిత్యాల: భర్త డబ్బులు పంపడం లేదని భార్య సూసైడ్

image

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కోరుట్లలోని అంబేడ్కర్ నగర్‌లో పూలవేణి సృజన (27) భర్త గల్ఫ్‌లో ఉంటున్నారు. అయితే తనకు కాకుండా అతడి తల్లికి డబ్బులు పంపిస్తున్నాడని మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 13, 2024

నేడు పెద్దాపూర్ గురుకులానికి డిప్యూటీ సీఎం భట్టి

image

మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు గురుకులానికి చేరుకొని అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో పాటు నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం గురుకులాన్ని సందర్శిస్తున్నారు.

News August 13, 2024

ర్యాగింగ్ చేయడం నేరం: జగిత్యాల ఎస్పీ

image

ర్యాగింగ్ చేయడం నేరమని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ర్యాగింగ్, సైబర్ మోసాల నివారణపై యువతకు, విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పొలాస అగ్రికల్చర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, అగ్రికల్చర్ కళాశాల డీన్ భారత్ బట్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

News August 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రామగుండంలో గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థిని మృతి. @ వెల్గటూర్ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ స్కాలర్షిప్ లు విడుదల చేయాలని సీఎం కు పోస్ట్ కార్డు రాసిన కోరుట్ల డిగ్రీ విద్యార్థులు. @ హైదరాబాదులో విద్యుత్ షాక్ తో కోరుట్ల యువతి మృతి. @ కొదురుపాక జడ్పి పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మహదేవ్పూర్ మండలంలో తండ్రి, కొడుకు మృతి.

News August 12, 2024

KNR: స్థానిక ఎన్నికలపై గ్రామాల్లో చర్చ?

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలపై ప్రతి గ్రామంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,400 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసి 6 నెలలు గడిచినప్పటికీ ఎన్నికలు జరగకపోవడంతో పల్లెలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. అయితే రిజర్వేషన్లు కొనసాగిస్తారా లేక మారుస్తారా? అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆశావహులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

News August 12, 2024

కరీంనగర్: 5,854 మంది విద్యార్థులకు రుగ్మతలు

image

కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు వివిధ కారణాలతో చిన్న వయసులోని రుగ్మతలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మొత్తం 5,854 మంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

News August 12, 2024

హరీశ్‌రావుకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

image

రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాలమైతే మీ ఖాతాలో.. కరవు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజాం మీ పార్టీదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదని ఆరోపించారు. సాంకేతిక సమస్యలు చూపించి రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, ఈ విషయం హరీశ్ రావుకి తెలుసని మండిపడ్డారు.

News August 12, 2024

కోరుట్ల: స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని సీఎంకు పోస్ట్ కార్డులు

image

స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా విన్నవించారు. మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు రాకపోవడం వల్ల పరీక్ష ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసుల కోసం డబ్బులు లేక కళాశాలకు రెగ్యులర్‌గా రాలేక చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని కోరారు.

News August 12, 2024

గల్ఫ్ జైలులో మగ్గుతున్న కార్మికుడు.. అండగా నిలిచిన వేములవాడ MLA

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య పాస్‌పోర్ట్ పోగొట్టుకొని బహ్రయిన్ జైలులో చిక్కుకున్నాడు. ఈ మేరకు నర్సయ్యను స్వదేశానికి క్షేమంగా వచ్చేలా చూడాలని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ఎంబసీ అధికారులను కోరారు. 28 ఏళ్ల కిందట నర్సయ్య బతుకుదెరువు నిమిత్తం బహ్రయిన్‌కు వెళ్లి మూడేళ్ల పాటు తాపీమేస్త్రీగా పని చేసి వర్క్ పర్మిట్ ముగియడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడు.

News August 12, 2024

వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సిరిసిల్లలో జెండాల తయారీ

image

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రణాళికలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు అవసరమైన జెండాల్లో సింహభాగం సిరిసిల్ల పట్టణంలో తయారు చేస్తున్నారు. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి.