India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు, సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ఈసభ తోడ్పాటునిస్తుందన్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు రూ.50వేల విలువైన చేసే 59రకాల వైద్యపరీక్షలను ఉచితంగా చేయిస్తున్నామన్నారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 68 వేల 488 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం, ప్రతి నెల 396 టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి లిపారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రకటించిన కామన్ డైట్ మెనూను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో రమ్య (25) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, వీణవంక ఎస్సై తిరుపతి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు కరీంనగర్ జిల్లాలో 1,43,899 సిలిండర్లు అందించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ పథకంలో ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 20, 474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పథకంలో కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం చేర్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 1837 చికిత్సలకు ఉచిత వైద్యం అందుతోందన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు నేషనల్ క్వాలిటీ ఎనురెన్స్ స్టాండర్డ్ అవార్డుకు ఎంపిక అయిందన్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించగా జిల్లాలో దాదాపు 2.10 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
కరీంనగర్ జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులూ చేర్పుల కోసం సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేస్తారని తెలిపారు.
ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వడానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన జిల్లాలోని 16 వేల 565 మంది ఉపాధిహామీ కూలీలను ఇప్పటి వరకు ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించి గ్రామసభలలో ఆమోదించామని తెలిపారు.
కేంద్ర మంత్రి పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా పలువురు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం మెమోలు జారీ చేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. పర్యటనకు విధులు కేటాయించిన ACP, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ట్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, DEO, DRDOలకు మెమోలు జారీ చేశారు.
కరీంనగర్ పట్టణం అశోక్నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమాని తాళం వేసుకొని ఉదయం వరంగల్కు వెళ్లాడు. ఇంటి యజమాని తిరిగి వచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. చూసే సరికి ఇంట్లో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, నగదు అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.