Karimnagar

News January 26, 2025

KNR: జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించగా జిల్లాలో దాదాపు 2.10 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

News January 26, 2025

KNR: అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులూ చేర్పుల కోసం సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేస్తారని తెలిపారు.

News January 26, 2025

KNR: 16,565 మంది ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా-కలెక్టర్

image

ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వడానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన జిల్లాలోని 16 వేల 565 మంది ఉపాధిహామీ కూలీలను ఇప్పటి వరకు ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించి గ్రామసభలలో ఆమోదించామని తెలిపారు.

News January 26, 2025

KNR: జిల్లా అధికారులకు మెమోలు జారీ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

image

కేంద్ర మంత్రి పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా పలువురు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం మెమోలు జారీ చేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. పర్యటనకు విధులు కేటాయించిన ACP, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ట్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, DEO, DRDOలకు మెమోలు జారీ చేశారు.

News January 26, 2025

కరీంనగర్: పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. భారీగా ఆభరణాలు మాయం

image

కరీంనగర్ పట్టణం అశోక్‌నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమాని తాళం వేసుకొని ఉదయం వరంగల్‌కు వెళ్లాడు. ఇంటి యజమాని తిరిగి వచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. చూసే సరికి ఇంట్లో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, నగదు అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 26, 2025

రేపు ప్రభుత్వం లాంచ్ చేయబోయే 4 పథకాల కోసం ఎంపికైన గ్రామాలు

image

చిగురుమామిడి – గునుకులపల్లి, చొప్పదండి – చిట్యాలపల్లి, ఇల్లందకుంట – బోగంపాడు, గంగాధర – కురిక్యాల, హుజూరాబాద్ – ధర్మరాజుపల్లి, జమ్మికుంట – గండ్రపల్లి, కరీంనగర్ రూరల్ – బహద్దూర్ ఖాన్ పేట, కొత్తపల్లి – బద్దిపల్లి, మానకొండూర్- ముంజంపల్లి, రామడుగు – దేశరాజ్ పల్లి, శంకరపట్నం – ఇప్పలపల్లి, తిమ్మాపూర్ – కొత్తపల్లి, సైదాపూర్ – వెన్కెపల్లి, వీణవంక – శ్రీరాములపేట, గన్నేరువరం – గుండ్లపల్లి

News January 25, 2025

కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేరికపై స్పందించిన బండి సంజయ్

image

బీజేపీలో నగర మేయర్ సునీల్ రావు చేరనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మేయర్ తో కలిసి మరికొంత మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వస్తారన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ సూచన మేరకు పరిమిత సంఖ్యలో కార్పొరేటర్లతో కలిసి బీజేపీలో మేయర్ సునీల్ రావు చేరుతున్నారు. భూ కబ్జాలు, నేరచరిత్ర ఉన్నవాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

News January 24, 2025

స్మార్ట్ సిటీ ద్వారా KNR అభివృద్ధి అయ్యిందంటే.. అది బండి సంజయ్ వల్లే: మేయర్

image

స్మార్ట్ సిటీ పై కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు(బీఆర్ఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వల్లే కరీంనగర్‌కు రూ.428 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. 2017లోనే కరీంనగర్ ను ‘స్మార్ట్ సిటీ’గా ఎంపిక చేసినా నిధులు రాలేదు అని తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ అభివృద్ధి అయ్యిందంటే అది బండి సంజయ్ వల్లే అని అన్నారు.

News January 24, 2025

నేడు కరీంనగర్‌కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

image

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్‌ని సందర్శిస్తారు.

News January 23, 2025

UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ

image

విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.

error: Content is protected !!