India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SRCL జిల్లా పరిధిలో కొనసాగుతున్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో గనుల శాఖ అధికారులు అరుదైన మూలకాలను గుర్తించారు. ఇవి దాదాపు 562.47 చ.కి. మేర విస్తరించి ఉన్నట్లు వారు తెలిపారు. సర్వేల్లో 17 లోహ మూలకాల(15 రకాల లాంథనైడ్స్తో పాటు స్కాండియం, ఏట్రియం)ను గుర్తించామన్నారు. ఖనిజాల అన్వేషణకు కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర గనుల శాఖకు నివేదిక పంపింది.
అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కుమార యాదవ్ వివరాల ప్రకారం.. మీనాజీపేటకు చెందిన జమున(24)కు అదే గ్రామానికి చెందిన సమ్మయ్యతో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి నచ్చకపోవడంతో అప్పటినుంచి భర్త తల్లి పద్మ, భర్త సోదరుడు పవన్ నిత్యం వేధించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,32,523 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.53,913, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.68,350, అన్నదానం రూ.10,260,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నాగుల పంచమి వేడుకలు. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి, ఇద్దరికి అస్వస్థత. @ జగిత్యాల జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావు. @ మెట్పల్లి మండలంలో బాలుడి పై వీధి కుక్క దాడి. @ గొల్లపల్లి మండలంలో 78 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ కరీంనగర్ లో సినీ హీరోయిన్ల సందడి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.in లో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని ‘ఎల్డీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ’ ద్వారా 100 మందికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మగ శిశువు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధుపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) లోపాలను ఎత్తిచూపింది. హుజూరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పథకం అనుకున్న మేర అమలు కాలేదని, తీవ్ర జాప్యం జరిగిందని స్పష్టం చేసింది. అసలు దళితబంధు కోసం కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం కేవలం 47 శాతం ఖర్చు చేసిందని, దాదాపుగా రూ.1300 కోట్లకు పైగా ఇంకా అలాగే ఉండిపోయాయని తన నివేదికలో వివరించింది.
ముగ్గురు వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మామిడి మొగిలి చిన్న కూతురు అఖిల(20) ఇంటి వద్ద ఉంటూ MLT చదువుతోంది. అఖిలను భరత్ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు వేధించారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై చేరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల్లో ముగ్గురు కుటుంబీకులు మృతి చెందారు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం శ్రీనివాస్(62) ఆయన భార్య అరుణ(55) సర్పంచిగా పని చేశారు. వీరి పెద్ద కొడుకు 3 నెలల కిందట ఫ్రేమ విఫలమై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మూత్రపిండాలు విఫలమై ఈ నెల 5న మృతి చెందారు. 3 నెలల కిందట కొడుకు, 3 రోజుల కిందట భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ అనారోగ్యంతో గురువారం చనిపోయారు.
కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం గ్రామానికి చెందిన కంకటి మౌనిక మూడు ఉద్యోగాలు సాధించారు. టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఏఈఈ ఫలితాల్లో ప్రతిభ చూపి పీఆర్ఆర్డీ విభాగంలో గెజిటెడ్ ఇంజినీరుగా ఉద్యోగం సాధించారు. దీంతో పాటు ఇటీవల గ్రూప్-4, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భర్త, పిల్లల సహకారంతోనే తాను ఉద్యోగం సాధించానని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.