India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. రుద్రంగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.
ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో-బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్బస్టాండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ సేవలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొప్పుల వినోద్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే వివిధ పూజలు, అలాగే వసతి గదిలో వివరాలను ఆన్లైన్లో పొందుపరిచిట్లు ఆయన తెలిపారు. https://vemulawadatemple.telangana .gov.in/ అనే వెబ్ సైట్లో ఉంచినట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు జిల్లాకు రానున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నారు. రేణిగుంట, నారాయణపూర్, రుద్రంగి, జైన గ్రామాలలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,38,986 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.94,801, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,180, అన్నదానం రూ.7,005, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ, వార్డు సభలు. @ వెల్గటూర్ మండలంలో కారు, బైక్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చొప్పదండిలో షార్ట్ సర్క్యూట్ తో 30 క్వింటాల్ల పత్తి దగ్ధం. @ కోనరావుపేట మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం. @ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు. @ రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్, పొన్నం.
Sorry, no posts matched your criteria.