India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతిభకు వయస్సు అడ్డుకాదని ఖమ్మం జిల్లాకు చెందిన బచ్చుపల్లి ఇషాన్ నిరూపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సాధనతో ఈ రికార్డును సాధించిన ఇషాన్, తన పాఠశాలకే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇషాన్ ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, స్థానికులు అభినందించారు.

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.

మహిళల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఇందిరా మహిళా శక్తిపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, కొత్త స్వశక్తి సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఏకరూప దుస్తుల కుట్టు పనులు, ఎర్రుపాలెం, కల్లూరులో సోలార్ ప్యానెల్స్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 3,644 ఎకరాల మేర పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 33% పైగా 2,893 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని గుర్తించారు. వరి 1,950 ఎకరాలు, పత్తి 330, పెసర 613 ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు. అత్యధికంగా కూసుమంచి మండలంలో 1,875 ఎకరాల్లో వరి, 320 పత్తి, పెసర 160 ఎకరాల పంటను రైతులు నష్టపోయారు.

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియా పంపిణీ PACS కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారానే జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సెప్టెంబర్ 3 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 2500 ఎకరాలకు ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో నూతన కార్డుదారులకు కూడా సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం అందించనున్నట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జీ.శ్రీలత తెలిపారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల లెవల్ స్టాక్ పాయింట్ను శనివారం ఆమె ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లోని బియ్యం నిల్వలను పరిశీలించి, బియ్యం దుకాణాలకు సరఫరా విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియాను సక్రమంగా అందజేయడానికి PACS ద్వారా సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలోని రైతు వేదికలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ప్యాక్స్ ద్వారా యూరియా సరఫరాపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, ప్యాక్స్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, తదితరులున్నారు.
Sorry, no posts matched your criteria.