Khammam

News August 26, 2025

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం: DMHO

image

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని DMHO డా. బి. కళావతి బాయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 26, 2025

ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా..!

image

ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 113 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నెల 1 నుంచి 24వ తేదీ వరకు మొత్తం 82 కేసులు వెలుగు చూశాయి. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాచి వడబోసిన నీరు, వేడి పదార్థాలు, పండ్లు తీసుకోవడమే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News August 26, 2025

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం: DMHO

image

జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మల్టిజోన్-1లో MBBSపూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుDMHO కళావతిబాయి తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్‌లో సబ్మిట్ చేసి ఆ తర్వాత పూర్తి వివరాలతో ఆఫ్‌లైన్ దరఖాస్తు ఆఫీస్‌లో ఇవ్వాలని తెలిపారు.
ఈనెల 30లోపు అందజేయాలని సూచించారు.

News August 26, 2025

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఆగస్టు 30 వరకు గడువు

image

ఖమ్మం జలజ టౌన్‌షిప్‌లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తిగల ఉద్యోగులు ఆగస్టు 30లోపు రూ. 2 లక్షలు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 8 టవర్లలోని 576 ఫ్లాట్లు ఉన్నాయి. చదరపు గజానికి రూ.1,150 ధరగా నిర్ణయించారు. లాటరీని సెప్టెంబర్ 8న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News August 25, 2025

కేంద్రంతో కోట్లాడి యూరియాను తీసుకొచ్చాం: మంత్రి తుమ్మల

image

యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడి35 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు తరలించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు.

News August 25, 2025

ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తమ పరిధిలో చేయగలిగిన పనిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని అధికారులను సూచించారు.

News August 25, 2025

ఖమ్మం Dy. కమిషనర్‌గా శ్రీనివాసరావు

image

ఖమ్మం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా K. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌కు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News August 25, 2025

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా మహమ్మద్ ముజాహిద్

image

ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా సోమవారం మహమ్మద్ ముజాహిద్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ అధికారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

News August 25, 2025

విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలి: సీపీ

image

నిమజ్జనం రోజు ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజ సూర్యాస్తమం కంటే ముందే ప్రారంభించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సీపీ సునీల్ దత్ సూచించారు. నిమజ్జనం నాడు విగ్రహం తరలించే వాహనాలు ముందుగా బుక్ చేసుకోవాలని, విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలని చెప్పారు. వినాయక మండపం సమీపంలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపు ఉంటే, అబ్కారీ శాఖ అధికారులు కట్టడి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్: జిల్లా కలెక్టర్

image

ప్రతి గణేష్ మండపానికి లైన్‌మెన్ ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వైభవోపేతంగా జరగాలని అధికారులను ఆదేశించారు.