Khammam

News August 23, 2024

రియాక్టర్ పేలుడు ఘటనలో భద్రాద్రి జిల్లా వాసి మృతి

image

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద గల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాద ఘటనలో అశ్వారావుపేట మండలం గంగారం గ్రామానికి చెందిన మార్ని సురేంద్ర(37) మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. సురేంద్ర గాజువాకలో నివాసం ఉంటూ తొమ్మిదేళ్లుగా అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని దుర్మరణం చెందాడు.

News August 23, 2024

ఖమ్మం: 1,73,329 మందికి రుణామాఫీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,73,329 మందికి రుణామాఫీ జరిగింది. ఖమ్మం జిల్లాలో 1,15,346మందికి, భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రుణం మాఫీ అయింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 8వేల మందికి పైగా అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదు. కొత్త రుణాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 23, 2024

దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోంది: పొంగులేటి

image

అదానీ గ్రూప్స్ సంస్థల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ దొంగచాటుగా అదానీ గ్రూప్ ను కాపాడుతుందని, దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

News August 22, 2024

చదువులో వెనుకబడిన వారిపై శ్రద్ధ చూపండి: DEO

image

బూసిగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలను ఏజెన్సీ DEO మల్లేశ్వరావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల పఠనాశక్తిని పరిశీలించారు. 20 శాతం విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నారని, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

News August 22, 2024

అర్హులందరికీ అందేదాకా రుణమాఫీ: మంత్రి తుమ్మల

image

రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు రైతులను గందరగోళంలో పడేసే మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఏనాడూ రైతుల గురించి మాట్లాడని వారు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు.

News August 22, 2024

KTDM:అత్తవారింటికి వచ్చి అల్లుడు సూసైడ్

image

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చిన అల్లుడు మద్యం మత్తులో కలుపు మందు తాగిన విషయం తెలిసిందే. ఖమ్మంకు చెందిన ఓంకార్ కు మణుగూరుకు చెందిన యువతితో ఏడాది కిందట వివాహమైంది. రాఖీపౌర్ణమికి అత్తగారి ఇంటికి వచ్చిన ఓంకార్ మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై మేడాప్రసాద్ కేసు నమోదు చేశారు.

News August 22, 2024

ఇల్లందు: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన హేమంత్, నిశాంత్ కొండపాక మండలం సిరిసినగండ్లలోని తమ బంధువుల ఇంట్లో గృహాప్రవేశానికి వచ్చారు. అనంతరం సరదాగా చెరువులోకి ఈతకు వెళ్లారు. చెరువు లోతు తెలియకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అనంతరం స్థానికులు గమనించి వారి మృతదేహాలను బయటకు తీశారు.

News August 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓మధిర నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
✓ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓భద్రాచలంలో అటవీ శాఖ సంస్థ చైర్మన్ పోదెం వీరయ్యకు సన్మాన కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News August 22, 2024

ఇల్లెందు: పెద్దల సమక్షంలో ప్రేమవివాహం

image

కొత్తగూడెంకు చెందిన నాగభవాని,ఇల్లెందు ఇందిరానగర్ కు చెందిన ప్రశాంత్ బుధవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి గతంలో పెద్దలు మాట్లాడుకున్నారు. కానీ పెళ్లి కుదరలేదు. ఆ తర్వాత నాగభవాని, ప్రశాంత్ ప్రేమించుకున్నారు. స్నేహితుల సహకారంతో బుధవారం వారు నాయకులగూడెం శ్రీకృష్ణుడి ఆలయంలో గ్రామపెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

News August 22, 2024

ఖమ్మం జిల్లాలో అంతులేని రోగాలతో ఇబ్బందులు

image

సాధారణంగా జ్వరం లక్షణాల ఆధారంగా అది ఏరకమో వైద్యులు అంచనాకు వస్తారు. జ్వరంతోపాటు కీళ్ల నొప్పులుంటే డెంగ్యూ, శరీరంపై దద్దుర్లుంటే గన్యా,తీవ్రమైన జ్వరమైతే మలేరియా, టైఫాయిడ్ అని ప్రాథమికంగా భావిస్తారు. కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు వైద్యులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా వ్యాధి కారక వైరస్ ఏంటనేది తెలియడం కష్టంగా మారుతోంది.