India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.
బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.
చింతకానికి చెందిన ఓ యువతి ఈ నెల7 నుంచి కానరాకుండా పోవడంతో అమెతండ్రి ఫిర్యాదు మేరకుపోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు కోదాడకు చెందిన ఓ యువకుడితో గత నెల 24 నిశ్చితార్థం జరిగింది. పెళ్లికోసం ఇంట్లో దాచిన రూ. 2.50 లక్షలుతీసుకోని వెళ్లిపోగా, ఎక్క డ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.
ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వరంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. 62మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2,71,77,000 నష్ట పరిహారాన్ని ఇప్పించారు. ప్రి-లిటిగేషన్ 18, క్రిమినల్ 643, సివిల్ 51, చెక్ 2,318, వివాహం 6, సైబర్ 78, ట్రాఫిక్ చలానాలు 16,169 పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు.
మహిళలను అభివృద్ధిపథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.Cm భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా శక్తి సభలో Dy.Cm మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే ప్రాజెక్టుల మంజూరు, సారపాక (భద్రాచలం) వరకు తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ అందించారు. పాండురంగాపురం -మల్కాన్గిరి రైల్వే లైన్ మంజూరు పట్ల తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలానికి తరలి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం లభిస్తుందని, యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
✓కారేపల్లి: బోరు వినియోగిస్తున్న ముగ్గురిపై కేసు ✓సత్తుపల్లి: డ్రైవర్ చాకచక్యం.. తప్పిన పెనుప్రమాదం ✓ఖమ్మం: మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పువ్వాడ ✓ఖమ్మం: మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు:Dy.Cm భట్టి ✓ పెనుబల్లి:బైకుల ధ్వంసం.. తండ్రీకొడుకులపై కేసు నమోదు:ఎస్ఐ వెంకటేష్ ✓కల్లూరు: రూ.54 లక్షలు గోల్మాల్.. అధికారుల స్పందన ✓ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ సంబురాలు.
√:ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు√:శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం √:ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన √:మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన √:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు√:నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈరోజు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు.
Sorry, no posts matched your criteria.