India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేలకొండపల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువు మాదారం, పైనంపల్లి, బుద్ధారం గ్రామాల్లో కుక్కలు పశువులపై, మనుషులపై దాడులకు దిగుతున్నాయని చెబుతున్నారు. ఈ నెలలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 60కి పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని రైతులకు షరతులు పెడుతున్న 5 ఎరువుల దుకాణాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారని చెప్పారు. రైతులు సైతం యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏమైనా షరతులు పెడితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న నగదు బాధితులకు రీఫండ్ చేసే వరకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని ఖమ్మం CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీసీ ద్వారా పోలీస్ అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో సైబర్ మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. బాధితులు 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో మొత్తం 3,778 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వైరాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మత్స్య విత్తన అభివృద్ధి శాఖ కార్యాలయం, వైరా రిజర్వాయర్లను పరిశీలించారు. ఆయన రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపల పెంపకం, దిగుబడిపై మత్స్య శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ వర్షాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం మున్నేరుకు వరద స్వల్పంగా పెరిగింది. సోమవారం 8 అడుగులకు తగ్గిన నీటిమట్టం, బుధవారం ఉదయం 10.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం మున్నేరులో 30 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఖమ్మం: సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 75 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 52 కేసులు కోలుకున్నాయని, 23 కేసులు యాక్టివ్గా ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లు, పరిసర 60 ఇండ్లలో ఫీవర్ సర్వే, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలన్నారు. లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

వనమహోత్సవం కింద ఈ సంవత్సరం వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి వనమహోత్సవం, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యాలయాల రూఫ్లపై సోలార్ ప్యానెళ్ల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

నిర్ణీత గడువులోగా పెండింగ్ సీఎంఆర్ రైస్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీఎంఆర్ సరఫరాపై మంగళవారం సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ సంబంధించి ఇప్పటి వరకు 1,69,549 మెట్రిక్ టన్నులు CMR రైస్ డెలివరీ పూర్తి చేశారని, పెండింగ్ 28,520 మెట్రిక్ టన్నులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న డ్రైనేజీని మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత వంటి అంశాలను కమిషనర్ సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ వ్యవస్థను బలపరచడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.