Khammam

News August 18, 2024

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి

image

సబ్బండవర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

News August 18, 2024

ఖమ్మం: ఒకే రోజు ఏడుగిరిపై కుక్కల దాడి

image

వెంకటాపురం మండలంలోని నూగురులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకేరోజు ఏడుగురిపై దాడి చేయడంతో బాధితులను వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఎటూరునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో మనుషులు, పశువులపై కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.

News August 18, 2024

కొత్తగూడెం వైద్య కళాశాలలో ఇంటర్వ్యూలు

image

కొత్తగూడెం వైద్య కళాశాలలో 19 క్యాటగిరీలలో 105 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రాజకుమార్ తెలిపారు. ప్రొఫెసర్లు 10, అసోసియేట్ ప్రొఫెసర్ 35, అసిస్టెంట్ ప్రొఫెసర్ 16, ట్యూటర్లు 22, సీనియర్ రెసిడెంట్లు 22 మందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఐడీవోసీలో కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామన్నారు.

News August 18, 2024

ఖమ్మం: పర్యాటక అభివృద్ధికి రూ.600 కోట్లు

image

కనకగిరి గుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసింది. గతంలో టూరిజం శాఖ ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల చండ్రుగొండ, కల్లూరు, తల్లాడ, జూలూరుపాడు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 18, 2024

కొత్తగూడెం: సింగరేణి కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా శ్రీనివాస్

image

సింగరేణి సంస్థ కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జీఎంగా ఉన్న గురువయ్య జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఆర్-1 జీఎంగా ఉన్న శ్రీనివాస్‌ను నియమించారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఆయన మాట్లాడుతూ.. విలువైన కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రమాదాల సంఖ్య తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, స్వీయరక్షణపై అందరూ దృష్టి సారించాలన్నారు.

News August 18, 2024

ఖమ్మం: అర్హులైన గిరిజనులకు పోడు భూముల హక్కులు

image

పోడు భూములలో వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించేందుకు విధి విధానాలపై రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి ధనసరి అనసూయ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 18, 2024

ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ పొడిగింపు

image

ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను మంగళవారం వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ శనివారం తెలిపారు. ప్రతినెలా 15 వరకే రేషన్ పంపిణీ చేసేవారని, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం నెలకొన్నందున ఈనెల 20 వరకు అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు. ఈమేరకు రేషన్ దుకాణాల్లోని ఈపాస్ యంత్రాల్లో మార్పులు చేశామన్నారు.

News August 18, 2024

ఉమ్మడి ఖమ్మంలో TODAY HEADLINES

image

☛ అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
☛ కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
☛ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
☛ వైరాలో ఉచిత వైద్య శిబిరం
☛ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
☛ అశ్వరావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
☛ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News August 18, 2024

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన పోలీస్ కమిషనర్

image

ఖమ్మం జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్ ను పోలీసు కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శనివారం సాయంత్రం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ చేరుకున్న న్యాయమూర్తి శరత్ జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News August 17, 2024

2 లక్షలలోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగింది: మంత్రి

image

ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. ఏదేని కారణాల వల్ల 2 లక్షలలోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.