India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. పైలెట్ ప్రాజెక్టుగా మధిర మండలం మడుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. మడుపల్లిలో నాలుగు ఎకరాల్లో రూ.3.50 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా హైదరాబాదు నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.
ఖమ్మం: మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూసుమంచి క్యాంప్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. జిల్లాలో రైతులు వేసిన పంటలో ఒక్క ఎకరం కూడా ఎండి పోవద్దని, పంట పొలాలకు అవసరమైన నీరు ప్రణాళికాబద్ధంగా రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు.
∆} సత్తుపల్లి:సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యం: ఎమ్మెల్యే రాగమయి∆}తెలంగాణ చిన్న తిరుపతి దేవస్థానంలో మంత్రి తుమ్మల, ఎంపీ∆} వైరా:రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు మృతి ∆} సత్తుపల్లిలో ఏన్కూరు వాసులకి రోడ్డు ప్రమాదం∆} సీఎం పేరు మర్చిపోయిన వైరా ఎమ్మెల్యే ∆} కూసుమంచి :భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి ∆} ఖమ్మం: ఇనుప రైలింగ్ తొలగించిన పుర అధికారులు
ఖమ్మం: జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (T.C.C) పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖర శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా ఫలితాలను వెబ్సైట్ www.bse.telangana.gov.in నందు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని డీఈఓ పేర్కొన్నారు.
ఖమ్మం: పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా తులం బంగారం హామీ లేట్ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
ఖమ్మం జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్లకు ఇప్పటి వరకు 101 దరఖాస్తులు వచ్చాయని రెడ్ కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీడు, బంజర భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పొందేలా రైతులను కేంద్రం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పొద్దుటూరు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమం ∆} మధిర నియోజకవర్గంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన.
ఖమ్మం జిల్లాలో బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు మహర్దశ పట్టనుంది. శిథిలావస్థలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల స్థానంలో నూతన భవనాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తుమ్మల కృషితో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో భవనానికి రూ.3 కోట్ల చొప్పున మొత్తం మూడు భవనాలకు రూ.9 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.
కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ పనులు నేపథ్యంలో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే అధికారి ఎం.డీ.జాఫర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు 8 రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఎదైనా సమాచారం కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో సంప్రదించాలన్నారు.
∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
Sorry, no posts matched your criteria.