India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈనెల 8,9,10,11, 15,17,18,22,23,24,28,30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.
ఖమ్మం: ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రైతులను రాజులు చేయాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని నెల రోజులలోపే రూ. 31 వేల కోట్లు రైతు పంట రుణమాఫీ చేశామన్నారు. ధరణి తో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.
దళిత బంధు దారి తప్పితే సహించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళితబంధు లబ్ధిదారులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. దళితబంధు కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? విచారణ చేయాలని అధికారులకు సూచించారు.
పోడు, అసైన్డ్ పట్టాలు కలిగి రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వనున్నట్లు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) సీఈఓ అబీద్ ఉర్ రెహమాన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ నుంచి కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం సూచించారు. కాగా, డీసీసీబీ పరిధిలో తొలి విడత 37,625 మంది రైతులకు రూ.121.63 కోట్లు, రెండో విడతలో 19,504 మంది రైతులకు రూ.88.09 కోట్లు రుణమాఫీ అయిందని తెలిపారు.
దోస్తానా అంటే ఖమ్మం వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
BRS ఓటమికి ప్రధాన కారణం ధరణి పోర్టలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులను నిలువునా ముంచిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. నాటి ముఖ్యమంత్రి KCR, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాత్రమే కూర్చొని ధరణి చట్టాన్ని అమల్లోకి తెచ్చి సంస్కరణలు తెచ్చామంటూ లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. తాము అలా చేయబోమని, తమది రైతు ప్రభుత్వమని చెప్పారు.
>సీఎం పర్యటనలోపు పనులను పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
>వికలాంగుడి సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్
>అటవీ శాఖ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని
చేయాలి: పొదెం
>అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం సమీక్ష
>రక్తంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రం
>డ్రగ్స్, గంజాయిపై సమాచారం ఇవ్వండి: ఏఎస్పీ
>పాలేరు పాతకాలవకు నీళ్లు విడుదల చేసిన మంత్రి పొంగులేటి
ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తన రక్తంతో గీసి ఓ వ్యక్తి అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండలానికి చెందిన మాణిక్యం అఖిల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి వీరాభిమాని. ఈ చిత్రాన్ని గీయడానికి తనకు ఐదు గంటల సమయం పట్టిందని చెప్పారు. 5ML తన రక్తం అవసరమైందన్నారు. తన అభిమానాన్ని విభిన్నంగా తెలియజేయడానికి మాత్రమే ఇలా చిత్రం గీశానని ఆయన తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఐదుగురి చొప్పున మాస్టర్ ట్రైనర్లుగా ఆపరేటర్ల జాబితా తయారు చేసి పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. వీరు శిక్షణ పొందిన అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఓటరు జాబితాపై అవగాహన కల్పిస్తారు.
Sorry, no posts matched your criteria.