India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం టేకులపల్లి ITI మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 21-35 సం.ల వయస్సు, ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షలు ఉంటుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్పై వస్తుండగా.. జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 నుంచి 13 వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో BNSS 163 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురికి మించి గుంపులుగా చేరడం, ఊరేగింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిషేధమన్నారు. డబ్బు, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. ఖమ్మం రూరల్, మధిర MPDO కార్యాలయాలు, వైరా MRO కార్యాలయం, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మం జిల్లాలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని, అర్హులు I&PRవెబ్సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల జాబితాను డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.