India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణకు(POSH చట్టం) ఖమ్మం విద్యుత్ సర్కిల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఈ శ్రీనివాసాచారి మహిళా ఉద్యోగులతో సమావేశమై, ఛైర్పర్సన్ రజని కుమారి నేతృత్వంలోని కమిటీ వివరాలను వెల్లడించారు. వేధింపులపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని భరోసా ఇచ్చారు. సురక్షిత పని వాతావరణమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరగనున్న వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం పరిధిలో ఈనెల 10, 11వ తేదీల్లో స్థానికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 11న జరిగే పోలింగ్లో ఓటర్లందరూ పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. కాగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి ప్రచారమైనా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 117 వార్డులకు 241 పోలింగ్ కేంద్రాలలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, శిక్షణ పూర్తయ్యాయని, 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా జైలుకు కుళ్లిన మటన్ సరఫరా అవుతోందన్న వార్తలను జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ ఖండించారు. దీనిపై జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. జైలుకు వరంగల్కు చెందిన అప్రూవ్డ్ కాంట్రాక్టర్ ద్వారానే మాంసం సరఫరా అవుతుందని, ఖమ్మం స్థానిక షాపుల నుంచి కాదన్నారు. నెలలో ఒకసారి మాత్రమే ఖైదీలకు మటన్ పెడతామని, అది కూడా జైలు వైద్యుల తనిఖీ తర్వాతే వండుతామని ఆయన వివరణిచ్చారు.
Sorry, no posts matched your criteria.