Khammam

News February 4, 2026

ఖమ్మం జిల్లాకు 1,517 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లా రైతుల కోసం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 1,517.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరుకుంది. ఏఓ పవన్‌కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. సాగు అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

News February 4, 2026

విద్యా పరిపాలనపై శిక్షణ.. గుజరాత్‌కు ఖమ్మం డీఈఓ!

image

ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) చైతన్య జైనీ వృత్తిపరమైన శిక్షణ కోసం గుజరాత్ వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విద్యా నిర్వహణ, ఆధునిక విధానాలపై జరిగే ప్రత్యేక తరగతుల్లో ఆమె పాల్గొంటారు. ఆమె గైర్హాజరీలో డీఈఓ కార్యాలయ ఏడీ చావా శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఈ శిక్షణ సాగనుంది.

News February 4, 2026

ఖమ్మం: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

image

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. 3.30లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, ఏకంగా 3.67లక్షల టన్నులు సేకరించినట్లు డీఎస్ఓ చందనకుమార్ తెలిపారు. రైతులకు రూ. 877.98 కోట్లు చెల్లించారు. సన్నబియ్యం బోనస్ కింద 39,476 మందికి రూ. 113.57 కోట్లు జమ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

News February 4, 2026

ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల బరిలో ఎంత మంది అంటే.?

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల బరిలో మొత్తం 415 మంది అభ్యర్థులు నిలిచారు. ఎదులాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 109 మంది, వైరా 84, మధిర 80, సత్తుపల్లి 72, కల్లూరులో 70 మంది పోటీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి 41 మంది అభ్యర్థులు ఉన్నారు. 372 మంది ఉపసంహరణ చేసుకున్నారు. తుది జాబితా ఖరారు కావడంతో ప్రచారం ముమ్మరమైంది.

News February 3, 2026

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఖమ్మం కలెక్టర్

image

వైరా మండలం పాలడుగు ఎంపీపీఎస్‌‌ను కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఈసీఆర్ 2.0 కార్యక్రమ ప్రగతిపై ఉపాధ్యాయులతో సమగ్రంగా రివ్యూ నిర్వహించారు. మొదటి వారం నుంచి పదో వారం వరకు విద్యార్థుల వారీగా సాధించిన పురోగతిని కలెక్టర్ స్వయంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు.

News February 3, 2026

ఖమ్మం: నేడు చివరి రోజు..

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎదులాపురంలో 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేడు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.

News February 3, 2026

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News February 3, 2026

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News February 3, 2026

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News February 2, 2026

ఖమ్మం జిల్లాలో 24 నామినేషన్ల ఉపసంహరణ

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎదులాపురంలో అత్యధికంగా 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. మంగళవారం ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.