Khammam

News July 22, 2024

KTDM: మద్యం మత్తులో పురుగుల మందు తాగి సూసైడ్

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.. ఎస్సై తిరుపతి రావు తెలిపిన వివరాలు ప్రకారం.. వీరభద్ర వరంలో మునిగెల శ్రీనివాస్ (55) మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించగా పురుగుల మందు తాగాడని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు.

News July 22, 2024

భద్రాచలం: కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

image

 క్రమ క్రమంగా పెరుగుతున్న గోదావరి, రాత్రి 10 గంటల సమయానికి 50 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

News July 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
∆} పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొంగులేటి
∆} టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కుల పంపిణీ
∆} పంచాయతీరాజ్ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
∆} వరదలపై సమీక్ష నిర్వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

News July 22, 2024

భద్రాద్రిలో విమానాశ్రమం నిర్మించాలి: ఎంపీ RRR

image

రాష్ట్రంలో నిర్వహణలో HYDలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.

News July 22, 2024

భద్రాద్రి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

image

వర్షాలు, వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

News July 22, 2024

గోదావరి వరదలపై మంత్రి సమీక్ష సమావేశం

image

గోదావరి వరదలపై సోమవారం భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు.

News July 22, 2024

పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదు: మహేశ్వర్ రెడ్డి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్‌ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

News July 22, 2024

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి

image

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఉత్తమ్ కలిశారు. తెలంగాణ‌లో రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు (ఓఎంసీ) చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

News July 22, 2024

పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి

image

అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెగిపోయిన ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. అధిక మొత్తంలో వరద రావడంతోనే ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఉన్నారు.

News July 22, 2024

బూర్గంపాడు: 3 కిలోమీటర్లు నడచి ఆసుపత్రికి తరలింపు

image

బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ వాసులు వర్షాకాలం వచ్చిందంటే భయపడే పరిస్థితి నెలకొంది. సోమవారం ఓ మహిళకు విపరీతమైన జ్వరం రావడంతో స్థానికులు సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలు మారుతున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపించారు. కాగా సదరు మహిళను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.