Khammam

News July 9, 2024

శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో డిప్యూటీ సీఎం

image

విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో డిప్యూటీ సీఎంకు మరియు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎ, మంత్రులను ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

News July 9, 2024

సీతమ్మ సాగర్‌ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతమ్మ సాగర్ సాగునీటి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధం చేశారు. అలాగే ఆగస్టు 15న భద్రాద్రి జిల్లాలో రాజీవ్ కాలువను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

News July 9, 2024

ఖమ్మం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

ఖమ్మం జిల్లాలో పొద్దుటూరు, బాణాపురం ఘటనలు మరువక ముందే రఘునాథపాలెం మండలం రజాబ్ అలీ నగర్‌కు చెందిన మరో రైతు ప్రసాద్(32) ఆత్మహత్యాయత్నం చేశాడు. భూమి విషయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. తన భూమిని ఓ కానిస్టేబుల్ అతని కూతురి పేరుపై అక్రమంగా పట్టా చేయించాడని బాధితుడు వాపోయాడు.

News July 9, 2024

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు: ఎంపీ RRR

image

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. సోమవారం కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీలు, ఎయిర్ పోర్టు ప్రాధాన్యతగా తీసుకుని వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, పాలేరు రిజర్వాయర్‌ను వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా మార్చాలనే ఆలోచన ఉందని తెలిపారు.

News July 9, 2024

బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి అవయవదానం 

image

నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన రైతు రంగారావు (53) జూన్ 28న ఇంట్లో ఉన్నట్టుండి కిందపడిపోయారు. కుటుంబీకులు అతడిని హైదారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో పది రోజులపాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ వైద్య బృంద సభ్యులు అతడి భార్య రేణుక ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా ఐదుగురికి అవయవాలు దానం చేశారు. 

News July 9, 2024

బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా కలెక్టర్

image

సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల జిల్లా ఆఫీసర్లు తమ సిబ్బంది ట్రాన్స్ ఫర్స్ దరఖాస్తులను ఈ నెల 12 లోపు ఇవ్వాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. బదిలీ దరఖాస్తులను 13 నుంచి 18 వరకు పరిశీలించనున్నట్లు తెలిపారు. మరోవైపు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల వద్ద నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఆఫీసర్లు చొరవ చూపాలన్నారు.

News July 9, 2024

KTDM: గుండెపోటుతో స్టాఫ్ నర్స్ మృతి

image

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి స్టాఫ్ నర్సు పి.కల్యాణి(36) విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి 8 గంటలకు ఆమె తనకు కేటాయించిన కాన్పు వార్డుకు వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.

News July 9, 2024

ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణం: RM KMM

image

ఖమ్మం రీజియన్లో ప్రతిరోజు 517 బస్సులు నడుపుతున్నామని RM సరి రామ్ తెలిపారు. ఆయా బస్సులలో రెండు లక్షల నుంచి 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలవారి సీజన్ టికెట్ రిటర్న్, జర్నీ రాయితీ టికెట్, సూపర్ లగ్జరీ చార్జితో లహరి NON AC బస్సు లలో ప్రయాణం వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

News July 9, 2024

యజమాని, కౌలుదారు ముందే మాట్లాడుకోవాలి: మంత్రి తుమ్మల

image

రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆగస్టు 15వ తేదీలోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నామన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలని, కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది సీఏం నిర్ణయమని స్పష్టం చేశారు.

News July 9, 2024

వైయస్సార్‌పై భట్టి కామెంట్స్

image

పాలకుడు ఎలా ఉండాలో వైయస్సార్ చూపించారని, ఆయన హయాంలో MLCగా పని చేయటం మర్చిపోలేనని డిప్యూటి సీఎం  భట్టి విక్రమార్క అన్నారు. వైయస్సార్ చివరి వరకు ప్రజల కోసమే పని చేశారని, సీఎంగా వైయస్సార్ తనదైన ముద్ర వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108వంటి సేవలు దేశానికే ఆదర్శమని, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు.