India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి ఏడాది ఈనెల 21న నిర్వహించే “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ డి.జానకి తెలిపారు.
✒6వ తరగతి-PG విద్యార్థులు
✒అంశం:1.డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, 2.విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు
✒పేరు నమోదుకు లింక్:https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
✒వ్యాసాన్ని పేపర్పై రాసి.. ఫోటో/ PDFలో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేయాలి
✒చివరి తేదీ:OCT 28

దీపావళి సందర్భంలో టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. టపాసుల విక్రయ దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు సమీపంలో అలాగే వివాదాస్పద స్థలాలలో ఏర్పాటు చేయరాదన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ.. పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి మద్యం టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. గతంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే, ఈసారి గడువు సమీపిస్తున్నా వందల్లో కూడా దాటలేదు. 2023లో 8, 128 అప్లికేషన్లు వస్తే, ఇప్పటివరకు కేవలం 278 మాత్రమే అందాయి. దాంతో అధికారులు అప్లికేషన్ల సంఖ్య పెంచేందుకు గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేస్తున్నారు. మద్యం షాపుల టెండర్ ఫీజులను పెంచడమే వెనకడుగు వేసేందుకు కారణంగా తెలుస్తోంది.

పాలమూరు విశ్వవిద్యాలయంలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టా రెడ్డి హాజరై ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఉమ్మడి MBNR జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు సహా 148 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తిరుపతి (పేదల తిరుపతి)గా పిలువబడే కురుమూర్తి (వెంకటేశ్వర స్వామి) బ్రహ్మోత్సవాలు ఈ నెల 22నుంచి ప్రారంభమై, వచ్చేనెల 7వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామివారి అలంకరణ మహోత్సవం, 28న ఉద్దాల మహోత్సవం నిర్వహించనునట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు.

పాలమూరు యూనివర్సిటీలోని క్రీడా కాంప్లెక్స్ లో సౌత్ జోన్ లో పాల్గొనేందుకు యోగ ఎంపికలు నిర్వహించారు.
✒బాలికల విభాగం:సంగీత,పూజ,అంకిత, లక్ష్మి,సురేఖ,అన్నపూర్ణ
✒పురుషుల విభాగం: శ్రీనివాస్,ఉదయ్ కుమార్,నరేష్, శివశంకర్,సాయి చరణ్, సచిన్, ఈనెల 24 నుండి ప్రారంభమయ్యే టోర్నీలలో బాలికల జట్టు సవ్యసా యూనివర్సిటీ (బెంగళూరు), బాలుర జట్టు వెల్ యూనివర్సిటీ(చెన్నై)లో పాల్గొననున్నట్లు PD Dr.Y.శ్రీనివాసులు తెలిపారు.

ATM కార్డు మార్చి చేసి ఓ వ్యక్తి రూ.28,500 స్వాహా చేసిన ఘటన మహమ్మదాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. SI శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. లింగయ్యపల్లి తండాకి చెందిన కాట్రావత్ రేణుక ఈనెల 8న మహమ్మదాబాద్లోని ATMలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తి ATM కార్డు నుంచి కొంత డబ్బులు ఇచ్చి వేరే కార్డు ఇచ్చాడు. అదేరోజు ఆ కార్డు నుంచి రూ.28,500 తీసుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. గతేడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు కోరారు.

సౌత్ జోన్(ఆల్ ఇండియా) ఇంటర్ వర్శిటీ యోగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్శిటీ యోగ స్త్రీ, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు వర్శిటీ ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు తెలిపారు. ఈ ఎంపికలకు ముఖ్య అతిథిగా ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.పూస రమేష్ బాబు హాజరై మాట్లాడారు. క్రీడల్లో మంచి నైపుణ్యం పట్టుదలతో విజయం సాధించి పాలమూరు వర్శిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్లో 81.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. నవాబుపేట 70, దేవరకద్ర 37.5, కౌకుంట్ల 31.3, చిన్నచింతకుంట 30.5, మూసాపేట మండలం జానంపేట 29.3, అడ్డాకుల 16.5, కోయిలకొండ మండలం పారుపల్లి 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.