India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.
❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’
బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మండల కేంద్రానికి చెందిన మణిదీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణంపై ఎవరిపైన అనుమానం లేదని, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.
MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.
LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి.
మహబూబ్నగర్ నుంచి తాండూర్ వెళ్లే రూట్లోని ఇబ్రహీంబాద్ వద్ద రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. చకచకా పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.
ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని Way2Newsతో గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కోయిల్కొండ ఎమ్మార్వో, ఎస్ఐ వచ్చి ఊరు బయట నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు. వారికి గ్రామస్థులు థ్యాంక్స్ తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు.
ఆయన పేదింటి యువకుడు.. తల్లిదండ్రుల కష్టం చూసిన అతడు GOVT స్కూల్లో చదువుతూనే ఎలాగైనా ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నారు. కష్టపడి చదివి సొంతంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నావికాదళంలో జాబ్ సాధించారు.ఆయనే వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తిపురం గ్రామ యువకుడు అశోక్.. తమ స్కూల్ పూర్వ విద్యార్థి అశోక్ జాబ్ కొట్టడం అభినందనీయమని మస్తిపురం ZPHS HMవెంకటన్న ఆయనను సన్మానించారు.
రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.