Mahbubnagar

News March 28, 2026

MBNR: పారుపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం పారుపల్లిలో 39.0 అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 38.9, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట 38.8, మహబూబ్‌నగర్ అర్బన్ 38.7, అడ్డాకుల 38.6, భూత్పూర్ మండలం కొత్త మొల్గర, మిడ్జిల్ మండలం దోనూరు, నవాబుపేట మండలం కొల్లూరు 38.5, హన్వాడ 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.

News March 28, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

image

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

News March 28, 2026

పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 27, 2026

MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్‌లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.

News March 26, 2026

MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

image

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్‌పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.

News March 26, 2026

MBNR: పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 26, 2026

సబ్సిటీ రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.లక్ష లోపు రుణాలపై 90% సబ్సిడీ, రూ.3లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

News March 26, 2026

బాలానగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో 5 రోజులుగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలంతా అధిక ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సాయంత్రం ఏదో ఒకచోట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 23.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజాపూర్ 3.0, మిడ్జిల్ మండలం దోనూరు 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

News March 26, 2026

MBNR: ‘173 సిలిండర్లు స్వాధీనం..121 కేసులు నమోదు’

image

గృహ అవసరాలకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. గత 15రోజులుగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.

News March 26, 2026

MBNR: కొత్త అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు..!

image

కేంద్ర ప్రభుత్వం కొత్త అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల విభజనకు ఏర్పాటు చేస్తున్నడంతో బాలానగర్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజాపూర్, నవాబుపేట, బాలానగర్ మండలాలతో కొత్త నియోజకవర్గ ఆవిర్భావించనున్నట్లు పలువురు విద్యావేత్తలు అంటున్నారు. జనాభా పెరుగుదల, భౌగోళిక సమతుల్యత, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.