Mahbubnagar

News April 4, 2025

‘మహబూబ్‌నగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం’

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

image

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్: BRS వాళ్లకు కాంగ్రెస్ నేత WARNING

image

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై BRS నాయకులు బురదజల్లే చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ హెచ్చరించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ఎన్నో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, అక్కడ మాజీ మంత్రి కూర్చోకుండా తనకు కుర్చీ వేయలేదంటూ అనవసర రాద్ధాంతం చేశారన్నారు.

News April 3, 2025

జడ్చర్లలో జోరుగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు

image

జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేడు మార్కెట్ యార్డ్‌లో క్వింటాల్ కందులకు గరిష్ఠంగా 6,879, ఆముదాలు 6,353, వేరుశనగ 6,769, జొన్న 4,011, బొబ్బర్లు 5,656, మొక్కజొన్నలు 2,268, ఆర్ఎన్ఆర్ రకం వడ్లు 2,059, మినుములు 7,316 ధర పలికాయి. నేడు మొత్తంగా మార్కెట్ యార్డ్‌కు 132 మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి తీసుకొచ్చారు.

News April 3, 2025

NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

image

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో <<15978702>>పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 3, 2025

GREAT: గ్రూప్ 1లో మెరిసిన పాలమూరు ఆణిముత్యం

image

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ కుమార్తె నందిని కలాల్‌ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు.TSPSC గ్రూప్-1 పరీక్షలో 467 మార్కులతో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే 281వ ర్యాంకు సాధించారు. గ్రూప్-2, 3లో కూడా ఆమె అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు Way2Newsకు తెలిపారు. గ్రూప్-1లో ఎంపిక కావడం సంతోషంగా ఉందని,UPSC తన లక్ష్యమంటూ పేర్కొన్నారు. #CONGRATULATIONS

News April 3, 2025

BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

image

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లి గ్రామంలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

అడ్డాకుల: అవసరాలకు డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

image

చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కి చెందిన శివ(32) కూలీపనులు చేస్తూ జీవిస్తున్నారు. అవసరానికి తల్లితో అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి తల్లితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ సోలార్ గేట్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 3, 2025

GWL: ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

News April 3, 2025

MBNR: 29 వేల మందికి మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం

image

మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ కింద 31,190 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు రాయితీతో అవకాశం కల్పించినా కేవలం 2వేల మంది మాత్రమే పరిష్కరించుకున్నారు. మిగిలిన 29 వేల మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ నెల వరకు 25 శాతం సబ్సిడీతో పరిష్కరించుకునేలా అవకాశాన్ని పొడిగించింది. ఇకనైనా వీరు ముందుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.

error: Content is protected !!