Mahbubnagar

News April 16, 2025

జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ కార్యక్రమాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలతో వెబెక్స్ నిర్వహించారు. మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకంలో రాణించేలా చూడాలన్నారు.

News April 16, 2025

మహబూబ్‌నగర్: నేటి నుంచి ఉచిత కోచింగ్ మీ కోసమే..!

image

ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ, వీఆర్ఏ, వీఆర్వో, గ్రూప్ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం MBNR ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఫ్రీ కోచింగ్ క్లాసులను ప్రారంభించనున్నారు. ఆయన సొంత నిధులతో బుధవారం ఉచితంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పర్యవేక్షకుడు మనోహర్ తెలిపారు.  

News April 16, 2025

పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్యభూమిక:PU ప్రిన్సిపల్✔రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ✔ఉమ్మడి జిల్లాల్లో భారీ వాన✔పోలేపల్లికి పోటెత్తిన భక్తులు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ✔మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

News April 15, 2025

మహబూబ్‌నగర్: కలెక్టర్ కదా కారులో.. వస్తారనుకున్నారా..!

image

తాము చేపట్టే పనుల్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కారులో వస్తారని అనుకున్న అధికారులకు కాలినడకన వచ్చి అధికారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి.. మండల పరిధిలోని తుమ్మలకుంట వంటి గుడిసే తండా, చిన్న గుట్ట తండా, తుమ్మలకుంట, వల్లూర్ గ్రామాల్లో చేపడుతున్న పునరావాస పనుల్ని మంగళవారం కలెక్టర్ విజయేంద్ర బోయి ఎండను సైతం లెక్కచేయకుండా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లి పరిశీలించారు.

News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

News April 15, 2025

BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.

News April 15, 2025

MBNR: భార్య వదిలిపెట్టిందని ఆత్మహత్య

image

భార్య వదిలిపెట్టి వెళ్లిపోయిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న నవాబుపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. మూడేళ్ల క్రితం శంషాబాద్‌లో ఐషా అనే యువతిని నవాబుపేటకు చెందిన తాజ్(30) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు రావటంతో ఐషా భర్తని వదిలి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తాజ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 15, 2025

మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

image

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందటం జరిగింది. జిల్లా కేంద్రం సమీపంలో దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపలు పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలు కావడం విశేషం.

News April 15, 2025

MBNR: విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా

image

MBNR పరిధిలో ఈతకు వెళ్లిన <<16098048>>ముగ్గురు యువకులు<<>> గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన విజయ్, అయ్యప్ప, మహమ్మద్ సమీపంలోని క్వారీ గుంతలోకి ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. విజయ్ మృతదేహాన్ని అక్కడే ఉన్న కొందరు వెలికితీయగా మిగితా ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

News April 15, 2025

మహబూబ్‌నగర్: మత్తు మందు ఇచ్చి.. అమ్మాయిపై అత్యాచార యత్నం!

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక  కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి  అమ్మాయిపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.