India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని నీతి, నిజాయతీతో జీవించాలని ఎస్పీ జానకి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. రామాయణాన్ని రచించడం ద్వారా ప్రజలకు ఎంతో నీతిని చాటి చెప్పారని, నిబద్ధతతో ఉండి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలా జీవించాలో మహర్షి చూపించారని ఎస్పీ పేర్కొన్నారు.

జడ్చర్లలో సోమవారం <<17930890>>కోనేరులో పడ్డ యువకుడి<<>> మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో ప్రమాదవశాత్తు పడ్డ వెంకటేశ్వర కాలనీకి చెందిన తప్పేట ప్రవీణ్ (28) మృతదేహం ఈరోజు ఉదయం తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్లో 65.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోయిలకొండ మండలం పారుపల్లిలో 30.8 మిల్లీమీటర్లు, రాజాపూర్లో 27.3, బాలానగర్లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. నవాబుపేటలో 4.3, మూసాపేటలో 2.3, మహబూబ్నగర్ అర్బన్లో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో MBNR జిల్లా బాలానగర్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. ఇతర జిల్లాల ప్రజలు తమ గ్రామాల నుంచి హైదరాబాద్కు పయనం కావడంతో రద్దీ పెరిగింది. జిల్లా ఎస్పీ డి.జానకి పరిస్థితిని పరిశీలించి, అంబేడ్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సై లెనిన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలు గమనించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావద్దని సూచించారు. SHARE IT.

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సల్కార్ పేటలో 35.8 మిల్లీమీటర్ల వర్షం రికార్డు నమోదయింది. నవాబుపేట మండలం కొల్లూరు 22.8, రాజాపూర్ 22.5, బాలానగర్ 19.8, మహమ్మదాబాద్ 19.0, నవాబుపేట 9.0, మిడ్జిల్ మండలం దోనూరు 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో ప్రవేశాలకు రేపే చివరి తేదీని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 6లోగా (ఫైన్ లేకుండా) www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, అడ్మిషన్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కడావత్ రాజేశ్వరి ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 377 మార్కులు సాధించి మెదక్ జిల్లాలోని మహేశ్వర మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. కానీ మొదటి విడతగా కట్టాల్సిన రూ.1.40 లక్షలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎవరైనా దాతలు ఉంటే ముందరికి వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల కేటాయింపులో పార్టీ కోసం కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని MBNR జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో శనివారం సమీక్ష నిర్వహించారు. నేతల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడితో యువతికి జిల్లా అదనపు ఎస్పీ జోక్యంతో న్యాయం జరిగింది. కందూర్కు చెందిన శివ, రాధ ప్రేమించుకున్నారు. రాధ గర్భవతిగా మారడంతో శివ పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ చొరవ తీసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి కందూర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వారికి వివాహం జరిపించారు.
Sorry, no posts matched your criteria.