India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల నుంచి ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం అదనపు సమయాన్ని పాఠశాలల్లో గడుపుతూ తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందజేయనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ యంత్రాంగం DEOలకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లాలో 13.97 లక్షల మంది వరకు ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్నారు. మే వరకు సగటున రోజుకు 2.70లక్షల మంది వరకు కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. రోజుకు రూ.5.40కోట్లు ఉపాధి కూలీల ఖాతాల్లో అప్పట్లో పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నెలకు సగటున ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీల కోసం రూ. 170 కోట్లు నిధులు విడుదల చేస్తోంది.
మరికల్కు చెందిన యువ న్యాయవాది అయ్యప్ప రష్యాలో జరుతున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తిగా అయ్యప్ప. ఈ సందర్భంగా అయ్యప్ప పలు దేశాల మంత్రులు, ప్రతినిధులను కలిశారు. భవిష్యత్తులో బ్రిక్స్ దేశాలు డాలర్పై ఆధారపడకుండా కామన్ కరెన్సీ విధానం తీసుకురావడం కోసం సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు.
కుమ్మెర సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్లోకి వరద నీరు చేరడంపై అధికారులు నివేదికను సమర్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి కుమ్మెర పంప్ హౌస్ను పరిశీలించారు. పంప్ హౌస్ ఏర్పాటుపై రూపొందించిన చిత్రాలతో అంచనాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోస్గి మండలం బలభద్రాయపల్లిలో నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచందారు. గ్రామానికి చెందిన నరసింహ, కవిత దంపతుల ఇద్దరు కొడుకులు నిహన్స్(3), భానుమూర్తి(2) బుధవారం ఇంటి పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో వారు ఊరంతా గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకడంతో మృతదేహాలు దొరికాయి. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మూడు రోజుల క్రితం స్వైన్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అతను హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు బుధవారం గుండూర్ గ్రామంలో సర్వే నిర్వహించారు. బాధితుని ఇంటి పరిసరాల్లో దాదాపు 50 కుటుంబాలను కలిసి వారి వివరాలను సేకరించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. RSP మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలో సమిధలు అవుతున్నది ఎస్సీలని అన్నారు. ఎస్సీ గురుకులాల్లో రాజ్యాంగ, చట్టబద్ధంగా నిబంధనలకు లోబడి నియామకాలు జరిగిన 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు. 2000 మంది నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారంటూ విరుచుకుపడ్డారు.
శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్స్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని, ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలని అన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు.
భూత్పూర్ మండలం మదిగట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుని శోభాయాత్రలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.