Mahbubnagar

News March 21, 2025

జడ్చర్లలో యూపీ వాసి మృతి

image

ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యూపీకి చెందిన విశ్వకర్మ(20), నిఖిల్ జైస్వాల్(19)లు పని మీద స్కూటీపై మెడికల్ షాప్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఆటో ఢీకొట్టింది. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న నిఖిల్‌ను యూపీ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

News March 21, 2025

MBNR: టెన్త్ విద్యార్థులు.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్‌పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.

News March 21, 2025

MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News March 21, 2025

MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 13,038 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.

News March 21, 2025

MBNR: TG ఖోఖో జట్టుకు ఎంపికైన డాక్టరమ్మ!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూర్ వెటర్నరీ దవాఖానాలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శిల్ప గతంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు ఆడనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దిల్లీకి బయలుదేరారు. CONGRATULATIONS

News March 21, 2025

మహబూబ్‌నగర్: పుష్ప.. తగ్గేదేలే..!

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం ఖో-ఖో పోటీలకు మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాంనగర్ పాఠశాలలో PETగా విధులు నిర్వహిస్తున్న బి.పుష్ప ఖో-ఖో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉమెన్స్ ఖో-ఖో టోర్నీలో ఆమె పాల్గొననున్నారు. దీంతో హెచ్ఎం అంజలి దేవి, ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATULATIONS

News March 21, 2025

ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీలు సహకరించాలి: MBNR కలెక్టర్

image

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా మార్పులు, చేర్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా నమోదు చేసుకోవాలని, ఇందుకు వారు సహకరించాలన్నారు. మార్పులు చేర్పులతోపాటు తప్పులు లేని జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News March 21, 2025

మహబూబ్‌నగర్: ఎండిన వరి పొలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోచమ్మ గడ్డ తండాలో రైతు బిక్యా నాయక్‌కు చెందిన మూడెకరాల వరి పొలాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. భూగర్భ జలాలు పడిపోవడంతో వరి పంట ఎండిపోయిందని, రైతులకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వ్యవసాయం ఎలా చేసుకోవాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలియజేయాలన్నారు. వారికి సూచనలు, సలహాలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీ ఆంజనేయులు ఉన్నారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్: ‘పెండింగ్ లేకుండా ట్యాక్స్ చెల్లించాలి’ 

image

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!