Mahbubnagar

News September 1, 2024

NRPT: ‘ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి’

image

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్లూ కోర్ట్స్ పోలీసులకు హెల్మెట్లను అందించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం బరువు అనుకోకుండా బాధ్యతగా భావించాలని చెప్పారు.

News August 31, 2024

ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు MVS ఓపెన్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శనివారం తెలిపారు. మరింత సమాచారం కోసం www.braou.ac.in వెబ్సైట్‌ను, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ కళాశాలను సంప్రదించగలరని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News August 31, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్, నాగర్‌కర్నూల్ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్, నాగర్‌కర్నూల్ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

MBNR: పరిష్కారానికి నోచుకోని సరిహద్దు సమస్య..!

image

జిల్లాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల భూ రికార్డుల పరంగా స్పష్టత లోపించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. MBNR, WNP జిల్లాలలో అటవీ, రెవెన్యూ యూ భూములకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల మంత్రివర్గ ఉప సంఘానికి రైతులు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించాలని మంత్రులు ఆదేశించారు.

News August 31, 2024

NGKL: కుంటలు, నాళాలు కబ్జా.. రోడ్లపైనే వర్షపు నీరు

image

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని కొన్ని కుంటలు కబ్జాకు గురి కావడంతో నీరంతా సామాన్యుల ఇళ్లల్లోకి, రోడ్లపైనే పారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలన్నీ కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రోడ్లపైకి వస్తున్నాయి. హైడ్రా మాదిరిగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News August 31, 2024

కనుమరుగవుతున్న చెరువులు పేటలో హైడ్రా అమలయ్యేనా?

image

NRPT: భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగుపెట్టిస్తున్న హైడ్రా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న క్రమంలో నారాయణపేట జిల్లాలో అమలు చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నారు. జిల్లాలో భూఆక్రమణలు మితిమీరిపోయాయి. కొండారెడ్డిపల్లి చెరువు కాలువ ఆక్రమణకు గురికాగా, సుభాశ్ రోడ్ లోని బారం బావికుంటతో పాటు పక్కనే ఉన్న మరో కుంటను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

News August 31, 2024

కష్టపడే వారికి పార్టీలో ఎప్పటికీ గుర్తింపు: సంపత్ కుమార్

image

అలంపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ గతంలో మహారాష్ట్ర రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తు ఉంటుందని దానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన సంపత్ కుమార్.

News August 31, 2024

GDWL: నేడు తాగునీటి సరఫరా బంద్

image

మిషన్ భగీరథ నుంచి జిల్లా ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిని శనివారం నిలిపివేయనున్నట్లు డీఈ రవిచంద్ర కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రం శుభ్రం చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం యథావిధిగా నీటిని సరఫరా చేస్తామని ఆయన వివరించారు.

News August 30, 2024

ప్రజల దృష్టి మళ్లించేందుకే “హైడ్రా”మా: RSP

image

హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చిందని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా వెనుక హైడ్రామా జరుగుతుందన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు, మహబూబ్ నగర్ లో పేద వర్గాలకు చెందిన నివాసాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చి వేశారని ప్రశ్నించారు.