India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ట్రాన్స్జెండర్ హత్యకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాన్స్జెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ట్రాన్స్జెండర్ల అధ్యక్షురాలు సుకన్య మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష మాని, తమ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ట్రాన్స్జెండర్ హత్యకు కారణమైన నిందితుడిని ఉరితీసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాలమూరులో గడచిన 14 నెలలుగా గ్రామాల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి తెచ్చింది. గత 14 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి అడుగంటి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు,పారిశుద్ధ్యం, మురుగు, తాగునీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖలు మంజూరు చేయ్యాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదికారులను ఆదేశించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార చట్టం-2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళ ఉద్యోగినులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు పని చేసే కార్యాలయంలో వారిపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం రద్దీగా కనిపించింది. గురువారంతో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో కాలేజీ హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, బయట రూంలు తీసుకొని చదువుకునే విద్యార్థులు ఖాళీ చేసి సొంతూళ్లకు బయలుదేరారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా రావడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం MBNRలోని జేజేఆర్ ఫంక్షన్ హాలులో జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి శుక్రవారం మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన సమస్యలైన జీతాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ బోనస్, గ్రాటిటి, పెన్షన్, లేబర్ కోడ్ రద్దు, కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ DE మనోహర్ హెచ్చరించారు. ఏనుగొండలోని కొర్రంగడ్డ కుంటను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం అధికారులతో కలిసి కుంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురిచేస్తే ఎంతటి వారైనా సహించబోమని మనోహర్ తెలిపారు.
HCU యూనివర్సిటీల భూముల వేలాన్ని వెంటనే ఆపాలని పాలమూరు యూనివర్సిటీ ముందు ఈరోజు ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కో కన్వీనర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకొచ్చి విద్యావ్యవస్థను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల భూములను వేల వేయడం ప్రభుత్వానికి చేతగానితనం వారు విమర్శించారు.విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే నిరసన చేస్తామన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. న్యూటన్ అమృత ప్రైవేట్ హాస్పిటల్ గల్లీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని MBNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.