Mahbubnagar

News August 30, 2024

NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఆదమరిస్తే.. ప్రమాదమే !

image

శ్రీశైలం- మద్దిమడుగు వైపు వెళ్లి వచ్చే రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మహబూబ్‌నగర్ నుంచి మద్దిమడుగు, శ్రీశైలానికి వెళ్లే దారి పలు చోట్ల కోతకు గురైంది. రోడ్డు సైడుకు గోతులు ఏర్పడి ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైడ్ తీసుకునే క్రమంలో ప్రమాదరకరంగా ఉంది. జాతీయ రహదారుల అధికారులు వెంటనే స్పందించి ఘాట్ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

News August 30, 2024

హన్వాడ: GREAT.. ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు

image

హన్వాడ మండలానికి చెందిన గుంత చెన్నయ్య(35) ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అత్యవసర విభాగంలో వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అతడి కాలేయం, 2 కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, 2 కంటి కార్నియాలను చూపు లేని వారి అమర్చినట్లు జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.

News August 30, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా గణపూర్లో 40.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా జక్లేర్‌లో 36.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా రాజోలిలో 34.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లెలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

News August 30, 2024

సెప్టెంబర్ 1 నుంచి మండల దీక్షాధారణ

image

అలంపూర్ పట్టణంలోని 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ సన్నిధిలో సెప్టెంబరు 1 నుంచి మండల దీక్షాధారణ ప్రారంభం అవుతుందని ఈవో పురేందర్ తెలిపారు. అలాగే అర్ధ మండల దీక్ష సెప్టెంబరు 20వ తేదీ నుంచి, నవరాత్రి దీక్ష అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. అమ్మవారికి ఇరుముడి అక్టోబరు 11వ తేదీన సమర్పించాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.

News August 30, 2024

MBNR: మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

పాలమూరులోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల మరో కీలక సూచన.
➤పర్మిషన్ కోసం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ 5మంది ఆర్గనైజర్ల ఆధార్ జిరాక్స్‌ జతచేయాలి.
➤మండపం సమీపంలోని ఓనర్ల నుంచి NOC తీసుకోని PSలో సమర్పించి అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ శుభవార్త చెప్పారు. అక్రమంగా కనెక్షన్‌ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.
SHARE IT

News August 30, 2024

NRPT: ‘పోలీసులు అప్రమత్తంగా ఉండాలి’

image

పోలీసులు తమ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధుల రక్షణ కొరకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News August 30, 2024

తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవెల్ అధికారులుతో మొదట మ్యాపింగ్ చేసుకొని, పంచాయతీలు, వార్డుల వారీగా జాగ్రత్తగా జాబితా సిద్ధం చేయాలన్నారు.

News August 29, 2024

కోస్గి ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మెరుగు శ్రీనివాసులు గురువారం తెలిపారు. CSE, CSE(AIML), CSE( డాటా సైన్స్)ల్లో పరిమిత సీట్లు కలవని ఆసక్తిగల విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంసెట్ పరీక్ష రాసి సీటు రానివారు, పరీక్ష రాయని వారు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 29, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మీ మండలంలో వర్షం పడుతుందా..? కామెంట్ చేయండి.

News August 29, 2024

పాత పెన్షన్ విధానం అమలు చేయాలి..చిన్నారెడ్డికి వినతి

image

రాష్ట్రంలో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి గురువారం TSCPSEU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేదని ఈ ప్రభుత్వంలోనైనా డిమాండ్ల సాధనకు కృషి చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా చూడాలని చిన్నారెడ్డిని కోరారు.