Mahbubnagar

News August 28, 2024

MBNR: DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 508 ఖాళీలకు గాను..14,577 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 13న విడుదల చేసిన ప్రాథమిక కీపై రాష్ట్ర వ్యాప్తంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరు నాటికి తుది కీ ప్రకటించి ఫలితాలు విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. MBNR-1:27, NGKL-1:29, GDWL-1:40, NRPT-1:19, WNPT-1:40 జిల్లాల్లో నిష్పత్తిలో పోటీ నెలకొంది.

News August 28, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా గుండుమల్లో 95.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 31.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 29.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దముద్దూనూరులో 21.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాల్పాడులో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 28, 2024

కాంగ్రెస్, బీజేపీ బెదిరింపులకు కేసీఆర్ లొంగరు: శ్రీనివాస్ గౌడ్

image

కల్వకుంట్ల కవిత బెయిల్ తప్పు పట్టే విధంగా మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ చావడానికైనా సిద్ధం కానీ.. ఆ పార్టీల బెదిరింపులకు లొంగరని అన్నారు. న్యాయమూర్తులు అన్ని విషయాలు విచారించిన తర్వాత బెయిల్ మంజూరు చేశారని, అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని నేతలపై మండిపడ్డారు.

News August 28, 2024

శ్రీశైలం జలాశయం UPDATE

image

శ్రీశైలం జలాశయంలో మంగళవారం 884.3 అడుగుల నీటిమట్టం, 211.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి 2,08,001 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంకు వచ్చింది. అక్కడి నుంచి మొత్తం 68,744 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30వేలు, రేగుమాన్ గడ్డ నుంచి MGKLAకు 1,931, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి HNSSకు 1,490 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

News August 28, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇదీ పరిస్థితి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనూ ఇలాంటి వ్యవస్థను తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. MBNR, గద్వాల, NGKL, WNP, NRPT జిల్లాల్లోని పట్టణాలు, మండలాల్లోని పలు చెరువులు, ప్రభుత్వం స్థలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు విమర్శలు ఉన్నాయి.

News August 28, 2024

భారతదేశంలో అత్యంత ఎత్తు అయిన ఏకాశీల గణపతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో భారతదేశంలో ఎత్తైన గణపతి విగ్రహం ఉంది. దాదాపు 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంది.పశ్చిమ చాళుక్య సామ్రాజ్య నేపథ్యం గురించి ఈ విగ్రహం వర్ణిస్తుంది.ప్రతి రోజు వందలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటారు.ప్రభుత్వం స్పందించి దీనిని పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News August 28, 2024

పాలమూరులో పేలుళ్ల కలకలం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ప్రమాదకరమైన జిలెటిన్‌ స్టిక్స్‌ ఉమ్మడి జిల్లాలో క్వారీలు, ప్రాజెక్టుల పనుల్లో ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. భారత్ మాల రోడ్డు నిర్మాణం కోసం గద్వాల జిల్లా గట్టు మండలంలోని గుట్టల్లో నిర్వహిస్తున్న మైనింగ్ పనులను సల్కాపూరం, జోగన్ గట్టు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పేలుడులో కూలీ మృతితో ఈ విషయం వెలుగులోకి కాగా భయాందోళనకు గురవుతున్నారు.

News August 28, 2024

44 గేట్లుఎత్తి దిగివకు కృష్ణమ్మ వరద నీరు

image

జూరాల ప్రాజెక్టు ఒక్కరోజులోనే లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి 44 గేట్లుఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం వైపు ప్రవహిస్తుండడంతో నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 33 గేట్లు తెరువగా.. సాయంత్రం 44 గేట్లుఎత్తి వరద నీటిని వదిలారు.

News August 27, 2024

నాగర్ కర్నూల్: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ మాట్లాడారు. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, మొదలైన సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే ఏ.పి.కె. ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలను కోరారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు.

News August 27, 2024

మహిళల రక్షణ కోసం 112 యాప్: DSP

image

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా 112 ఆప్ తీసుకొచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో 112కు ఫిర్యాదు చేస్తే సమీపంలోని ఠాణాకు సమాచారం వెళ్తుందని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్రమత్తమై లొకేషన్‌ ద్వారా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడుతారని.. ప్రతి ఒక్కరు ఈ యాప్‌పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.