Mahbubnagar

News August 16, 2025

MBNR: పనులకు శ్రీకారం చుట్టిన ఎంపీ డీకే అరుణ

image

అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె MBNR జిల్లాలోని చిన్న చింతకుంటలో పర్యటించారు. రూ.18 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. వాల్మీకి దేవాలయం, మాతా గంగా భవాని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.

News August 16, 2025

పాలమూరు: అథ్లెటిక్స్.. రేపే ఎంపికలు

image

MBNRలోని DSA స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపికలు రేపు ఉ. 9:00 గం.కు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్ చంద్ర Way2Newsతో తెలిపారు. అండర్-14, 16, 18,& 20 బాల బాలికలకు విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, ఆసక్తిగల విద్యార్థులు టెన్త్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌తో అథ్లెటిక్ కోచ్ సునీల్ కుమార్‌కు రిపోర్ట్ చేయాలన్నారు. మిగతా వివరాలకు 94406 56162, 98497 06360 సంప్రదించాలన్నారు. SHARE IT

News August 16, 2025

NRPT: 20న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

NRPTలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో పాల్గొనేందుకు ఈనెల 20న బాల,బాలికలకు అండర్-14, 16,18,20 ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ Way2Newsతో తెలిపారు. U-14(15-10-2011/14-10-2023), U-16(15-10-2009/14-10-2011), U-18(15-10-2007/14-10-2009), U-20(15-10-2005/14-10-2007) మధ్య జన్మించి ఉండాలని, పూర్తి వివరాలకు 91007 53683,90593 25183 సంప్రదించాలన్నారు.

News August 15, 2025

MBNR: పోలీసు పరేడ్ మైదానంలో.. స్వాతంత్ర్య వేడుకలు

image

MBNRలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

News August 15, 2025

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

News August 15, 2025

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపనలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

News August 15, 2025

MBNR:ASI మొయిజుద్దీన్.. రివార్డ్స్ ఇవే!

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్ ఇండియా పోలీస్ మెడల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇప్పటివరకు 70 కాష్ రివార్డులు, 18 GSEలు, 12 ప్రశంస పత్రాలు, 1 సేవా పతకం(2013), తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం(2017), ఉత్తక పోలీస్ పతకం(2019) అందుకున్నారు. భారత ప్రభుత్వం ఇండియా పోలీస్ మెడల్ ప్రకటించడంతో పలువురు అభినందిస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 14, 2025

MBNR: మొహమ్మద్ మొయిజుద్దీన్ ప్రొఫైల్

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మొహమ్మద్ మొయిజుద్దీన్‌కు IPM(Indian Police Medal) భారత ప్రభుత్వం ప్రకటించింది.1989లో పోలీస్ కానిస్టేబుల్‌గా నియమితులై, అలంపూర్, తిమ్మాజిపేట్, జడ్చర్ల, పెద్దకొతపల్లి, కోస్గి PSలో విధులు నిర్వహించారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2018లో ASIగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

News August 14, 2025

MBNR: ఓపెన్ డిగ్రీ,PG.. గడువు పొడగింపు

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News August 14, 2025

జడ్చర్ల: గల్లంతైన యువకుడి ఇతడే..!

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. పట్టణంలోని బోయలకుంటకు చెందిన భాను (24) కు ఏడాది క్రితం పెళ్లయింది. ఈరోజు సాయంత్రం వంద పడకల ఆసుపత్రి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న ఓ మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసిన వరద నీటిలో కొట్టుకుపోయాడని స్థానికులు అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.