Mahbubnagar

News September 22, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ UPDATES

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం 21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9.562 TMCల నీరు నిల్వ ఉంది.

News September 22, 2024

MBNR: కొత్త రేషన్ కార్డులు.. ఈసారైనా వచ్చేనా.?

image

ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు.

News September 22, 2024

‘వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలను 20 ప్రైవేట్, 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా MBNRలోనే 14 ప్రైవేట్, 3 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. WNPT-9,GDWL-4,NRPT-5 ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయి. NGKLలో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో లేవు.

News September 22, 2024

వనపర్తి: ఇది ఈ జలాశయం ప్రత్యేకత.!

image

వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు సూచనతో ఇంజనీరు రామకృష్ణ రాజు కృషితో 1959లో 10 గ్రామాలకు సాగునీరు అందించేలా సరళా సాగర్ జలాశయాన్ని రూ.36 లక్షల వ్యయంతో నిర్మించారు. 23 అడుగుల్లో 491.37 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లు నీరు నిల్వ ఉండేలా సైఫన్లు ఏర్పాటు చేశారు. నీటి మట్టం రాగానే గాలి పీడనంతో ఎవరి ప్రమేయం లేకుండా జలాశయం కవాటాలు తెరుచుకొని 250 HP పీడనంతో నీరు బయటకు వస్తుంది. ఇది ఈ జలాశయం ప్రత్యేకత.

News September 22, 2024

MBNR: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

image

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. కల్వకుర్తి పట్టణ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాహక్కు చట్టం, బాలల హక్కు చట్టం, ర్యాగింగ్ వంటి చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.

News September 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤MBNR: రేపు ఉమ్మడి జిల్లా అండర్-19 క్రికెట్ జట్టు ఎంపిక
❤పెబ్బేరు:ATM చోరీ..రూ.15లక్షలు మాయం
❤BRS 4 ముక్కలైంది:MBNR ఎమ్మెల్యే
❤NGKL:దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
❤నూతన పోలీస్ స్టేషన్లో పై ఫోకస్
❤పలుచోట్ల వర్షం
❤NGKL: పిడుగు పడి రైతు మృతి
❤నేటితో ముగిసిన ఓటరు జాబితా అభ్యంతరాలు
❤గ్రామ పంచాయతీ వర్కర్స్ పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి:IFTU

News September 21, 2024

MBNR: UPDATE.. ఓటర్ల వివరాలు ఇలా.!

image

మహబూబ్ నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో 3,838 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఈనెల 28న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో కసరత్తులు చేపట్టారు. ఈ నెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయగా.. దాని ప్రకారం 5,16,062 మంది ఓటర్లు ఉన్నారు. 2,57,477 మంది పురుషులు, 2,58,578 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 1,101 మంది మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

News September 21, 2024

MBNR: బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం ఫైర్

image

BRSపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. BRS పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. PAC ఛైర్మన్ పదవికి నలుగురిలో అరెకపూడి ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ అవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు.

News September 21, 2024

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ పాత్ర ఎనలేనిది: మాజీ మంత్రి

image

తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని వెల్లడించారు.

News September 21, 2024

NGKL: దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

image

బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.