Mahbubnagar

News August 14, 2025

MBNR: ASIకి భారత ప్రభుత్వ ఇండియా పోలీస్ మెడల్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్(ASI)కు ఇండియా పోలీస్ మెడల్(IPM) భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి మొహమ్మద్ మొయిజుద్దీన్‌ని అభినందిస్తూ..“పోలీసు శాఖలో ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. ఆయన కృషికి లభించిన గౌరవం అని ఎస్పీ కొనియాడారు.

News August 14, 2025

అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజలను కోరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News August 14, 2025

యూరియా అందుబాటులో ఉండేలా చూడాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని DCMS మన గ్రోమోర్ సెంటర్లను కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించి, యూరియా లభ్యత, పంపిణీ విధానం గురించి ఆరా తీశారు. యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీలో భాగంగా అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News August 14, 2025

మత్తుకు బానిసలు కావొద్దు: ఎస్పీ జానకి

image

విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తుకు అడిక్ట్ కావొద్దని MBNR ఎస్పీ డి.జానకి సూచించారు. ధర్మాపూర్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. చదువుకునే క్రమంలో విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెడు స్నేహాలు, వ్యసనాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. సీఐ శ్రీనివాస్, ఏఎస్ఐ జయరాణి పాల్గొన్నారు.

News August 13, 2025

MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2025

MBNR : మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

MBNR జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్ 14.3మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. మహబూబ్ నగర్ అర్బన్, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 7.0, హన్వాడ 6.8, కోయిలకొండ మండలం పారుపల్లి 6.0, భూత్పూర్ 5.0, అడ్డాకుల 4.5, , మిడ్జిల్ 4.3, నవాబుపేట 4.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్, బాలానగర్ 3.8, కౌకుంట్ల 3.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 12, 2025

MBNR: పోలీసులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారు: MP

image

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.

News August 12, 2025

MBNR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఎస్పీ జానకి హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలను దాటవద్దని, ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వైపు వెళ్లవద్దని సూచించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News August 12, 2025

చిన్న చింత కుంటలో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జడ్చర్ల 23.3, నవాబుపేట 20.8, కౌకుంట్ల 20.3, మహమ్మదాబాద్, దేవరకద్ర 18.5, మహబూబ్‌నగర్ అర్బన్18.3, అడ్డాకుల 17.8, మూసాపేట మండలం జానంపేట, హన్వాడ 16.8, భూత్పూర్ 16.5, బాలానగర్ 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News August 12, 2025

MBNR: GOVT బడుల్లో.. FREE ప్రైమరీ..!

image

ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు (ఫ్రీ ప్రైమరీ) ప్రారంభించనుంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 94 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందజేయనున్నారు. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే మొదటి విడత నిధులు మంజూరయ్యాయి.