Medak

News August 12, 2025

మత్తు పదార్థాల అక్రమ రవాణా అరికట్టాలి: ఎస్పీ

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌ను సోమవారం మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

News August 11, 2025

MDK: పాత పద్ధతిలోనే SSC పరీక్షలు

image

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి SSC పబ్లిక్ పరీక్షల్లో 20% ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 80% మార్కులు మూల్యాంకనానికి కేటాయించే విధానం కొనసాగనున్నట్లు DEO రాధాకిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులల్లో సమతుల్యతను తీసుకొస్తుందని పేర్కొన్నారు.

News August 11, 2025

భవిత కేంద్రంలో సదుపాయాల కల్పనకు చర్యలు: కలెక్టర్

image

భవిత కేంద్రం రూపురేఖలు మార్చి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ భవితా కేంద్రాన్ని DEO రాధా కిషన్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సందర్శించారు. ముందుగా భవిత కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న ఫిజియోథెరపీ, సౌకర్యాలను నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ పిల్లల్లో సామర్థ్యాలు పెంచేందుకు భవిత కేంద్రాలు దోహదపడతాయన్నారు.

News August 11, 2025

మెదక్ కలెక్టర్‌కు రాఖీ కట్టిన దివ్యాంగురాలు

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఓ దివ్యాంగురాలు రాఖీ కట్టింది. ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఓ దివ్యాంగురాలు వచ్చి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి నిబంధనలు, అర్హతలు పరిశీలించాలని డీఎల్పీఓను ఆదేశించారు. అనంతరం ఆమె రాఖీ కట్టేందుకు రాగా కలెక్టర్ కుర్చీలోంచి లేచి వచ్చి రాఖీ కట్టించుకున్నారు.

News August 11, 2025

నులి పురుగుల నిర్మూలనే లక్ష్యం: కలెక్టర్ రాహుల్ రాజ్

image

విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులు చేరితే రక్తహీనత, ఆకలి మందగించడం, విరోచనాలు, బరువు తగ్గడం సమస్యలు ఎదురవుతాయన్నారు. జిల్లాలో 2,11,964 మందికి మాత్రలు వేస్తారు.

News August 11, 2025

మెదక్ జిల్లాలో నేటి వర్షపాతం అప్డేట్..!

image

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కౌడిపల్లి 25.0, చిలిప్ చెడ్ 19.5, మెదక్ (RDO ఆఫీస్)16.8, లక్ష్మాపూర్ ESS (రామాయంపేట) 12.5, చిప్పల్తుర్తి (నర్సాపూర్) 8.8, రామాయంపేట 7.8, బోడగట్ ESS (టేక్మాల్) 7.0, అల్లాదుర్గ్ 4.3, మిన్‌పూర్ ESS (పాపన్నపేట) 2.8, రాజ్‌పల్లి (మెదక్) 2.8, చేగుంట 2.0 మిమీ వర్షపాతం నమోదైంది.

News August 11, 2025

మెతుకుసీమ.. ఇక లేదు ఏ ‘లోటు’

image

మెతకుసీమను వర్షాలు మురిపించాయి. నిన్నటి వరకు లోటు వర్షపాతంలో ఉండగా నేడు సాధారణానికి మించి నమోదైంది. సాగుకు మరో వారం మాత్రమే గడవు ఉండగా రైతులు ముమ్మర నాట్లు వేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోటును దాటేసింది. నిన్నటి వరకు 387 మిమీ వర్షం కురవాల్సి ఉండగా నేటికి 400 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు సాగుకు జీవం పోశాయని రైతులు తెలిపారు.

News August 11, 2025

మెదక్: రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ

image

కొత్త పట్టాదారు రైతులు ఆగస్టు 13వ తేదీలోగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ తెలిపారు. జూన్ 6 వరకు పట్టా పాస్ బుక్ పొందిన, అంతకు ముందు బీమా చేసుకోని రైతులు అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. కొత్త రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్, రైతు ఆధార్, నామినీ ఆధార్, బ్యాంక్ ఖాతాతో అప్లై చేసుకోవాలని సూచించారు. 18-59 ఏళ్ల రైతు బీమాకు అర్హులని వెల్లడించారు.

News August 11, 2025

మెదక్: ‘గడువులోగా పనులు పూర్తి చేయాలి’

image

ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు గడువు తేదీలోగా ‌పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ‌ఆదేశించారు. మెదక్ జిల్లా కేంద్రంలో బోధన్ రోడ్డులో గాంధీనగర్ ఏరియాలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులపై మ్యాప్ పరిశీలిస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News August 10, 2025

అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలి: కలెక్టర్

image

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. పాపన్నపేట మండలం మిన్‌పూర్ 220 కేవీ సబ్ స్టేషన్ సందర్శించి పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్లు గురించి ఆరా తీశారు. సాంకేతిక పరికరాల పనితీరును పరిశీలించారు.