India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రామాల్లో పకడ్బందీగా జ్వరం సర్వే నిర్వహించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం కౌడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎవరైనా మూడు రోజులు జ్వరంతో బాధపడుతున్నట్టయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు.
మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రామాయంపేటలో అత్యధికంగా 91 మిమీ, అత్యల్పంగా రేగోడ్ 1.0 మిమీ వర్షపాతం నమోదైంది. అటు మనోహరాబాద్ 90.6, పెద్ద శంకరంపేట 83.8, నర్సాపూర్ 73, కౌడిపల్లి 63.8, వెల్దుర్తి 63.3, చిలిప్ చెడ్ 60.8, చేగుంట 59.8, పాపన్నపేట్ 57.3, టేక్మాల్ 55, చిన్న శంకరంపేట 53.6 మిమీ వర్షపాతం రికార్డు అయ్యింది.
మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కావడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం ఉదయం 19.4 అడుగుల మట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండడంతో పర్యాటకుల తాకిడి మొదలైంది.
11 నుంచి 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారికి నులిపురుగుల నివారణ మాత్రలు అందిస్తామని మంత్రి దామోదర్ తెలిపారు. రేగోడ్లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులను నిర్మూలించి, రక్తహీనత తగ్గించి, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో ఈ మాత్రలు సహకరిస్తాయని తెలిపారు.
ఈనెల 13 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా పాసు పుస్తకాలు పొంది 18-59 ఏళ్ల వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
మెదక్ జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల 2,11,964 మందికి నులిపురుగుల నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. 11న సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని మాత్రలను వేస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీలు, విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలల్లో మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 12న మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ అధ్యక్షతన జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని హానికర కర్మాగారాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కర్మగారాల ఉపప్రధాన అధికారి లక్ష్మీ కుమారి తెలిపారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, మెదక్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ పై మాట్లాడారు.
మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు 19 అడుగుల నీటిమట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. వర్షాలకు ప్రాజెక్ట్ నిండుకోవడంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు. రాఖీ సెలవులు కావడంతో పర్యాటకులు వస్తున్నారు.
మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నర్సాపూర్లోని చిప్పలతుర్తి 65.5, కాగజ్ మద్దుర్ 8.3, నర్సాపూర్ 34.8, చేగుంట 41.8, శివ్వంపేటలో కొత్తపేట 36.3, శివ్వంపేట 24.3, వెల్దుర్తి 34.8, రామాయంపేట 23.3, మెదక్ 22.3, మాసాయిపేట 19.5, మనోహరాబాద్ 18.5, అల్లాదుర్గ్ 4.0, టేక్మాల్ 3.3, కుల్చారం 0.8 మిమీ వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.