Medak

News March 29, 2025

సంగారెడ్డి: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ శిక్షణ కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు అర్హులని చెప్పారు. తెల్ల రేషన్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 29, 2025

చరిత్రకు వారధులు కవులు: నందిని సిధారెడ్డి

image

చరిత్రకు వారధులు కవులు అని, చరిత్ర భావి తరాలకు తెలియాలంటే కవుల కలాలు కదిలించాలని తెలంగాణ తెలుగు సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ఎంతో గొప్పది అన్నారు.

News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

News March 28, 2025

మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News March 28, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

image

మెదక్ పట్టణం గాంధీ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.

News March 28, 2025

మెదక్: ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి వీడ్కోలు

image

ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్ రెడ్డి గురువారం పదవి వీడ్కోలు పొందారు. హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లికి చెందిన శేరి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి గులాబీ పార్టీలో పనిచేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన సుభాష్ రెడ్డికి ఆరు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నేటితో పదవి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ సత్కరించారు.

News March 27, 2025

మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్‌లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News March 27, 2025

MDK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

మెదక్: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

image

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ఉంటుందన్నారు.