Medak

News March 20, 2025

మెదక్: 24న సీజ్ చేసిన బియ్యం వేలం

image

పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని వేలం ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటలలో లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు. అత్యధిక వేలం దారులకు బియ్యాన్ని అమ్మనున్నట్లు చెప్పారు.

News March 20, 2025

మెదక్: పారదర్శక పాలనే లక్ష్యం: కలెక్టర్

image

పారదర్శక రెవిన్యూ పాలనే లక్ష్యంగా సంబంధిత తహశీల్దార్లు జవాబు దారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు అన్ని మండలాల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరిండెంటెంట్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి పెండింగ్ ప్రజావాణి సమస్యలు, ధరణి సమస్యలపై సమీక్షించారు.

News March 20, 2025

MDK: సీఎం రేవంత్, మంత్రిని కలిసి ఎస్సీ నేతలు

image

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దశాబ్దాల కల నెరవేరిందని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని మంత్రి అన్నారు.

News March 19, 2025

నిజాంపేట: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడి సూసైడ్ UPDATE

image

నిజాంపేట మండలం కేంద్రానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గరుగుల భాను(18) ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ కావడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన భాను మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 19, 2025

మెదక్ జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

image

చిన్నశంకరంపేట మండలం మడూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణిచాళుక్య, కాకతీయ శైలుల శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగశయనమూర్తి విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజ మహిషాసురమర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయన్నారు.

News March 19, 2025

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

image

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.

News March 19, 2025

మెదక్‌లో తల్లీకూతురు మిస్సింగ్.. కేసు నమోదు

image

మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన చెందిన ఎం. విజయలక్ష్మి(54) తన కూతురు ఎం. మణిదీపిక (27)లు సోమవారం మిస్ అయ్యారు. మెదక్‌లోని వారి ఇంట్లో నుంచి వెళ్లిన వీరు ఇద్దరూ కనిపించట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే 8712657878, 8712657913 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 19, 2025

మెదక్: భట్టి బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి కేటాయింపులపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నీటిని అందించే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్ పనులు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా జిల్లాలో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

మెదక్ యువతకు GOOD NEWS

image

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మెదక్ జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.

News March 19, 2025

మెదక్: యువకుడి సూసైడ్

image

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!