India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 13 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా పాసు పుస్తకాలు పొంది 18-59 ఏళ్ల వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
మెదక్ జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల 2,11,964 మందికి నులిపురుగుల నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. 11న సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని మాత్రలను వేస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీలు, విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలల్లో మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 12న మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ అధ్యక్షతన జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని హానికర కర్మాగారాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కర్మగారాల ఉపప్రధాన అధికారి లక్ష్మీ కుమారి తెలిపారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, మెదక్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ పై మాట్లాడారు.
మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు 19 అడుగుల నీటిమట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. వర్షాలకు ప్రాజెక్ట్ నిండుకోవడంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు. రాఖీ సెలవులు కావడంతో పర్యాటకులు వస్తున్నారు.
మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నర్సాపూర్లోని చిప్పలతుర్తి 65.5, కాగజ్ మద్దుర్ 8.3, నర్సాపూర్ 34.8, చేగుంట 41.8, శివ్వంపేటలో కొత్తపేట 36.3, శివ్వంపేట 24.3, వెల్దుర్తి 34.8, రామాయంపేట 23.3, మెదక్ 22.3, మాసాయిపేట 19.5, మనోహరాబాద్ 18.5, అల్లాదుర్గ్ 4.0, టేక్మాల్ 3.3, కుల్చారం 0.8 మిమీ వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి తెలిపారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశం పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశం అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని స్పష్టం చేశారు.
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అక్కచెల్లెళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికీ సంతోషం, ఐక్యత, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత సన్నిధిలో పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకోగా భక్తులు పల్లకిసేవలో పాల్గొని తరించిపోయారు.
పునరావాసంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ భరోసా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మెదక్ భరోసా సెంటర్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కేక్ కట్ చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి తదితరులు హాజరయ్యారు. పిల్లలపై లైంగిక దాడుల నివారణ, బాధితుల పునరావాసంపై విలువైన చర్చించారు.
Sorry, no posts matched your criteria.