Medak

News August 29, 2024

ఏం చేస్తున్నావ్ రేవంత్‌ రెడ్డి: హరీశ్‌ రావు

image

CM రేవంత్‌రెడ్డి గురుకులాల్లో మౌలిక వసతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. మీ పాలన ఎలా ఉందొ చెప్పడానికి గురుకులాలే నిదర్శనం. KCR హయాంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయి’అని X వేదికగా ఫైర్‌ అయ్యారు. విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు.

News August 29, 2024

MDK: మళ్లీ ‘ప్రజాపాలన’.. రేషన్ కార్డులు దక్కేనా..?

image

సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు మళ్లీ ప్రజాపాలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారైనా కొత్త రేషన్ కార్డులు అందుతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండవ విడత ప్రజాపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటిసారి ప్రజాపాలనలో మెదక్ జిల్లాలో ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రేషన్ కార్డుల కోసం 2.23.357 దరఖాస్తులు వచ్చాయి.

News August 29, 2024

సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

image

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్‌ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

News August 29, 2024

ఒక్క రోజే నలుగురు సస్పెండ్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, తహశీల్దార్‌ను కలెక్టర్ క్రాంతి సస్పెండ్ చేశారు. ఈనెల 27న ఆందోల్, జోగిపేటలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం విధితమే. ఆ సమయంలో ఆందోల్ తహశీల్దార్ నజిమ్ ఖాన్, జోగిపేట ప్రాంతీయ వందపడకల ఆస్పత్రి డాక్టర్లు నాగరాజు, దివాకర్‌, స్టాఫ్ నర్స్ రాథోడ్ రేణుక అందుబాటులో లేకపోవడం, విధులపై నిర్లక్ష్యంగా ఉండటంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

News August 29, 2024

సిద్దిపేట: నాణ్యమైన విద్యను అందిద్దాం: డిఐఈఓ

image

ఇంటర్మీడియట్‌లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.

News August 28, 2024

దెగులవాడిలో భారీ కొండచిలువ

image

కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలోని పాడుబడిన ఇంటి గోడల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఆ విష సర్పాన్ని ప్రత్యక్షంగా చూశామని స్థానికులు రఘునందన్ కులకర్ణి, నాగనాథ్ రెడ్డి, నాగిరెడ్డి తెలిపారు. దాదాపు 15 ఫీట్ల పొడవు ఉందని చెప్పారు.

News August 28, 2024

మెదక్: మళ్లీ ‘ప్రజాపాలన’.. రేషన్ కార్డులు దక్కేనా..?

image

సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు మళ్లీ ప్రజాపాలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారైనా కొత్త రేషన్ కార్డులు అందుతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండవ విడత ప్రజాపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటిసారి ప్రజాపాలనలో మెదక్ జిల్లాలో ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రేషన్ కార్డుల కోసం 2.23.357 దరఖాస్తులు వచ్చాయి.

News August 28, 2024

సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

image

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్‌ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

News August 28, 2024

సంగారెడ్డి: ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

image

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో పద్మజా రాణికి సమర్పించారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

News August 28, 2024

మెదక్: క్వారీ నీటి గుంతలో పడి యువకులు మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలో ఉన్న క్వారీ నీటి గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నిన్న సాయంత్రం ముగ్గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో మునిగి ఇద్దరు మృతి చెందారు. గట్టు మీద ఉన్న మరో యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయి విషయాన్ని చెప్పకుండా దాచాడు. ఈ రోజు ఉదయం విషయం చెప్పడంతో ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.