Medak

News August 26, 2024

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు: హరీశ్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని MLA హ‌రీశ్‌రావు అన్నారు. ‘సంగారెడ్డి (D) వట్‌పల్లి (M) మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు తాగి విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని హ‌రీశ్‌రావు Xలో పోస్టు చేశారు.

News August 26, 2024

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు: హరీశ్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని MLA హ‌రీశ్‌రావు అన్నారు. ‘సంగారెడ్డి (D) వట్‌పల్లి (M) మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు తాగి విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని హ‌రీశ్‌రావు Xలో పోస్టు చేశారు.

News August 26, 2024

మెదక్: రైతుపై ఎలుగుబంటి దాడి

image

మెదక్ జిల్లాలో రైతులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన ఘటన ఈ ఉదయం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హవేలీఘనాపూర్ మండలం వాడి గ్రామ పంచాయతీలోని దూప్ సింగ్ తండా చెందిన రవి.. గ్రామ శివారులోని తన పొలానికి నీరు పెడుతున్నారు. ఈ క్రంలో పక్కన ఉన్న చెరకు తోటలో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వెంటనే రవిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

సంగారెడ్డి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ప్రధానమంత్రి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న ప్రతిభావంతులు అర్హులని చెప్పారు. పిల్లల రక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31లోగా http@awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 26, 2024

MDK: ప్రియురాలికి పెళ్లి నిశ్చయం.. ప్రియుడు సూసైడ్

image

మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ప్రేమించిన యువతకి పెళ్లి నిశ్చయమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. బండారు చందుబాబు(25) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోక పోగా ఆమెకు మరో యువకుడుతో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చందు ఈనెల 13న విషం తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News August 26, 2024

అర్హులందరికీ రుణమాఫీ: వ్యసాయ అధికారి

image

ఉమ్మడి జిల్లాలో పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో మొత్తం 81,801 మంది రైతులకు రూ.599.14 కోట్లు జమ చేసింది. అయితే తమకు మాఫీ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 5657 ఫిర్యాదు రాగా.. అత్యధికంగా కొల్చారం మండలం నుంచి ఉన్నాయి. రుణమాఫీ కానీ రైతులంతా AOలకు ఫిర్యాదు చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు.

News August 26, 2024

మెదక్: రైతు రుణమాఫీకి ప్రత్యేక యాప్

image

జిల్లావ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతుల సమస్యల కొరకు ప్రభుత్వం “రైతు భరోసా” పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ అమలు గురించి అధికారులకు ఈనెల 27న ఉన్నతాధికారులు అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదంటూ మండల వ్యవసాయ అధికారులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ యాప్ రాకతో రైతుల సమస్యలు తీరనున్నాయని పలువులు అంటున్నారు.

News August 26, 2024

MDK: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 25, 2024

సంగారెడ్డి: ‘కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి’

image

కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్ లో తోషిబా పరిశ్రమ కార్మికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తోషిబా పరిశ్రమలో అవకాశ వాదులను ఓడించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.

News August 25, 2024

సంగారెడ్డి: వండర్ బుక్ ఆఫ్ రికార్డులో కూచిపూడి నృత్య ప్రదర్శన

image

వాసవి మా ఇల్లు, నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 131 మంది నృత్య కళాకారులు 9.5 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ నాగేందర్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ సర్టిఫికెట్ నిర్వాహకులకు అందించారు.