Medak

News August 25, 2024

UPDATE: ఖేడ్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నారాయణఖేడ్ మండలం నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నేరంగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(27) ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

News August 25, 2024

జగదేవ్పూర్: తల్లిదండ్రుల సూసైడ్.. అనాథలైన చిన్నారులు

image

జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన శేఖర్, సౌమ్య దంపతులు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. చిన్నారులకు గజ్వేల్ మనం ఫౌండేషన్ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. అధ్యక్షుడు స్వామి, సభ్యులు కనకయ్య, ఆంజనేయులు వారికి రూ.10వేలు అందజేసి మానవత్వం చాటుకున్నారు. పిల్లలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలాలని కోరారు.

News August 25, 2024

రావి ఆకులపై చిన్ని కృష్ణుడి చిత్రాలు

image

సంగారెడ్డి జిల్లా అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆదివారం రావి ఆకులపై విభిన్న రూపాల్లో నంద గోపాలుడి చిత్రాలు గీసి అబ్బురపరిచారు. ఆకులపై రూపొందించిన మురళీ కృష్ణుడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరలై, ఆర్టిస్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 26, 27న శ్రీకృష్ణ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

News August 25, 2024

సిద్దిపేట: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

image

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్దిపేట(D) గజ్వేల్‌‌కు చెందిన శివ(26) పెయింటర్‌. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News August 25, 2024

కొత్త జీపీగా తాట్‌పల్లి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో నూతనంగా తాట్‌పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో ఇప్పటి వరకు 37 గ్రామ పంచాయతీలు ఉండగా తాజాగా వాటి సంఖ్య 38కి చేరి జిల్లాలోనే న్యాల్‌కల్‌ అతిపెద్ద మండలంగా అవతరించింది.

News August 24, 2024

MDK: డెంగ్యూతో బాలుడి మృతి

image

చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలుడు కామ అయాన్స్ (5) డెంగ్యూతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు… బాలుడికి గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ విషయమై డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. రెండు రకాల డెంగ్యూ వైరస్‌లు అటాచ్ కావడంతో మెదడుపై ఎఫెక్ట్ పడి బాలుడు మృతి చెందాడని వివరించారు.

News August 24, 2024

కౌడిపల్లి: పాముకాటుతో బాలిక మృతి

image

పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఈరోజు జరిగింది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(12) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 24, 2024

సిద్దిపేట-మెదక్ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు

image

అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామస్థులు విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి డిప్యుటేషన్ చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు, గ్రామస్థులు, మాజీ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో సిద్దిపేట మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

News August 24, 2024

మెదక్: ఆశల పల్లకిలో పల్లె పోరు !

image

గత ఆరు నెలలుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావాహులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితా తయారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యువత స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

News August 24, 2024

సింగూరు ప్రాజెక్టుకు స్వల్ప వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1907 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 391 క్యూసెక్కులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలేల్మ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 80 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.