Medak

News May 7, 2025

MDK: సెలవుల్లో క్లాసులు నిర్వాహిస్తే చర్యలు: డీఈవో

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. జిల్లాలో జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు.

News May 7, 2025

మెదక్: అకాల వర్షం.. తడిసిన ధాన్యం కుప్పలు

image

అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేస్తుంది. చేతికొచ్చిన ధాన్యం వర్షార్పణం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్చారం మండలం కొంగోడు వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఒకసారిగా వర్షం కురవడంతో అనేకచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మీరు నిలవడంతో తూకం వేయలేని పరిస్థితి నెలకొంది. ధాన్యం కాపాడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

News May 7, 2025

మెదక్: ‘ధాన్యాన్ని శుభ్రంగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి’

image

రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శుభ్రంగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రభుత్వ కన్జ్యూమర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై జాయింట్ సెక్రటరీ ప్రియాంక అల అన్నారు. శుక్రవారం మెదక్ మండలంలోని కొంటూర్, రాజ్ పల్లి, బాలనగర్ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

News May 7, 2025

మెదక్: ‘రేపటి లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

మెదక్ జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు రేపటిలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.

News May 7, 2025

ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పక్కాగా జరగాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పక్కాగా జరగాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్యతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కార్యక్రమంపై సంబంధిత ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన వెరిఫికేషన్ అధికారులకు సూచనలు చేశారు.

News April 25, 2025

మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

image

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.

News April 25, 2025

నర్సాపూర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

image

నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News April 25, 2025

మెదక్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన యువతి

image

సైబర్ మోసగాళ్ల వలలో పడి యువతి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రూ.1000 చెల్లిస్తే రూ.600 కమిషన్ వస్తుందని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా రూ.1.28 లక్షలు చెల్లించిన యువతి తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2025

మెదక్ కలెక్టరేట్‌లో మహిళా వ్యాపారులకు అవగాహన

image

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు. కలెక్టరేట్‌లో వీ హబ్ ద్వారా జిల్లాలోని SHG మహిళలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) పై అవగాహన కల్పించారు.

News April 24, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి దౌల్తాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పులిమామిడి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానికులు తెలిపారు.