Medak

News August 5, 2024

అల్లాదుర్గం మండలంలో మర్డర్!

image

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చిత్తరి బేతయ్యను గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2024

వర్గల్: శంభుగిరి కొండపై రంగు అక్షరాల్లో శాసనం

image

వర్గల్ మండల కేంద్రంలోని శంభుగిరి కొండలపై రంగు అక్షరాల్లో శాసనం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీ రామోజీ హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు దీనిని గుర్తించారు. ఈ శాసనం లిఖించిన గుహను దేవాలయ సిబ్బంది స్టోర్ రూం తరహాలో వినియోగిస్తున్నారు. శాసనంలోని చాలా భాగం చెదిరి కొన్ని పదాలు మాత్రమే మిగిలాయని హరగోపాల్ తెలిపారు. అక్షరాలు వరగంటి, స్వస్తిశ్రీ, మల్ల, కల్గిని కనిపిస్తున్నాయి.

News August 5, 2024

సంగారెడ్డి: 8 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకోవచ్చని పేర్కొన్నారు. పదవ తరగతి చదివిన వారు ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 4, 2024

మెదక్ రీజియన్‌‌లో 3.80 కోట్ల మంది ప్రయాణం

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా మెదక్ రీజియన్‌‌లో ప్రతిరోజు లక్ష 70 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని మెదక్ ఆర్ఎం ప్రభులత తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన 9 డిసెంబర్ 2023 నుంచి నేటి వరకు సుమారుగా ఉచిత ప్రయాణాన్ని 3.80 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో 70%గా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో నేడు 98%కి పెరిగిందన్నారు.

News August 4, 2024

మెదక్: జోగులాంబ అమ్మవారి సేవలో ఎంపీ రఘునందన్ రావు

image

అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ఆదివారం ఉదయం మెదక్ ఎంపీ రఘునందన్ రావు దంపతులు దర్శించుకున్నారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న మొక్కులను చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

News August 4, 2024

MDK: బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి

image

బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పరిగిలో జరిగింది. స్థానికులు వివరాలు.. బిహార్‌కు చెందిన ధర్మేందర్ ఓ ఐరన్ కంపెనీలో పని చేస్తూ బీసీ కాలనీలో భార్య, 8 నెలల కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని గదిలో కూర్చోబెట్టి భార్య వాష్ రూంకి వెళ్లింది. అయితే ఆడుకుంటూ వెళ్లి చిన్నారి ప్రమాదవశాత్తు బాల్కనీలో ఉన్న బకెట్లో పడి మృతి చెందింది. దీంతో కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 4, 2024

మెదక్‌లో పీడిస్తున్న విష జ్వరాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పెరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు, దోమల కారణంగా చిన్న పిల్లలు పలు రకాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలతో మాతాశిశు వైద్య కేంద్రం నిర్వహిస్తున్నారు. కాగా, జూన్‌ 1 నుంచి జులై 31 వరకు MCHకు 11,096 మంది పిల్లలు వచ్చారని అధికారులు తెలిపారు. వీరిలో జ్వర పీడితులు 1,910 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

News August 3, 2024

మెదక్: మంచినీటి, మురుగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేయండి: ఎంపీ

image

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిపై తక్షణం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. శనివారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్‌ను కలిసి తెల్లా పూర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రధాన ప్రాంతంగా తెల్లాపూర్ ఉందని, వందలాది గేటెడ్ కమ్యూనిటీలతో ఈ ప్రాంతం ఉందన్నారు.

News August 3, 2024

తెల్లపూర్: అభివృద్ధి పనులను సమీక్షించిన ఎంపీ

image

తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శనివారం సమీక్షించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఆర్గానిక్ ప్రోడక్ట్ స్టాల్‌ను సందర్శించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

News August 3, 2024

సిద్దిపేట: త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

image

సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ అనురాధ సందర్శించారు. విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. విపీఓ వ్యవస్థను మరింత బలపరచాలని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను బలపరుచుకోవాలని తెలిపారు. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలన్నారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.