Medak

News April 4, 2025

మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించండి: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజనతో మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్కో జిల్లా మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎల్‌డిఎం నరసింహమూర్తి, ఎస్సీ ట్రాన్స్‌కో శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5వేల జనాభా గల గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు.

News April 3, 2025

కార్యదర్శుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం

image

మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం(TPSF) గ్రామ కార్యదర్శులకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని జేపీఎస్, ఓపిఎస్ సెక్రటరీల పెండింగ్ వేతనాలు, గ్రామ పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు సహా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, టీపీఎస్ఎఫ్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2025

ఢిల్లీలో మూడో రోజు బీసీ రిలే నిరాహార దీక్షలు

image

బీసీలకు 42% రిజర్వేషన్ విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఓబిసి ఆజాదీ సత్యాగ్రహ్’ దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలోని పలువురు నాయకులు దీక్షలోని నాయకులను పరామర్శించి మద్దతు ఇచ్చినట్లు బీసీ నాయకులు గంగాధర్ తెలిపారు. పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించాలని డిమాండ్ చేశారు.

News April 3, 2025

మెదక్: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.

News April 3, 2025

చేగుంట: చిన్న శివనూర్‌లో యువకుడి ఆత్మహత్య

image

చేగుంట మండలం చిన్న శివనూర్‌కి చెందిన మెదక్ సంతోష్ గౌడ్ (25) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు సంతోష్‌ను నార్సింగి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం మరో ఊరికి వెళ్లగా సంతోష్ ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు.

News April 3, 2025

 వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

image

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

News April 3, 2025

నర్సాపూర్: కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన అంగన్వాడీ సిబ్బంది

image

నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మండలంలోని కాగజ్ మద్దూర్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లినగుడ్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. కుళ్లినగుడ్ల పంపిణీ పై ప్రశ్నిస్తే తమపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారిణిని వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపారు.

News April 3, 2025

MDK: కలెక్టర్ జాయిన్ చేసిన బాలిక అదృశ్యం..?

image

పాపన్నపేట కేజీబీవీ నుంచి బాలిక అదృశ్యమైంది. మెదక్ బాలసదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయగా అక్కడి నుంచి బాలిక వెళ్లిపోయినట్లు తెలిసింది.

News April 3, 2025

MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

image

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

మెదక్ జిల్లాలో ముగిసిన టెన్త్ పరీక్షలు

image

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగింది. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 10,408 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకృష్ణ తెలిపారు. 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.